బహ్రెయిన్:మనీ లాండరింగ్ కు పాల్పడిన వ్యాపారవేత్తకు ఏడేళ్ల జైలు శిక్ష
- September 30, 2020
మనామా:అక్రమ లావాదేవీలు, ఆస్తుల అమ్మకాల్లో మోసాలకు పాల్పడుతున్న వ్యాపారవేత్తకు బహ్రెయిన్ అప్పీల్ కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. జైలు శిక్షతో పాటు BD1,00,000 జరిమానా విధించింది. డబ్బులు చెల్లించకుంటే దానికి సమానమైన అతని ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని తీర్పునిచ్చింది. బహ్రెయిన్ కు చెందిన వ్యాపారవేత్త..సౌదీకి చెందిన వ్యక్తిని దాదాపు BD3 మిలియన్లు మోసం చేసినట్లు వచ్చిన ఆరోపణలు రుజువు కావటంతో అతనికి శిక్షను ఖరారు చేసింది. బహ్రెయిన్ లోని ఓ ఆఫీస్ బిల్డింగ్ ను నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి సౌదీ వ్యక్తికి విక్రయించాడు. మోసపోయిన సౌదీ వ్యక్తి డబ్బులు చెల్లించిన తర్వాత అతను కొన్న బిల్డింగ్ వేరే వ్యక్తులదని...తనకు ఇచ్చిన డాక్యుమెంట్లు నకిలీవని గుర్తించినట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే..శిక్షపడిన వ్యాపారవేత్త గతంలోనూ అక్రమ లావాదేవీలు నిర్వహించినట్లు అధికారులు చెబుతున్నారు. బహ్రెయిన్ నుంచి పారిపోయిన అతను పలు దేశాల్లో భవనాలు, నైట్ క్లబ్స్, స్టాక్స్ కొన్నాడని తెలిపారు. అయితే..విదేశాల్లోని ఆస్తుల్లో చాలావరకు కొల్పోయిన తర్వాత తిరిగి బహ్రెయిన్ కు చేరుకున్నాడు. 2008లో అతను అక్రమాలకు పాల్పడి సంపాదించిన BD3 మిలియన్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!







