జెడ్డాలో సోషల్‌ డిస్టెన్సింగ్‌ పట్ల నిర్లక్ష్యం

- October 01, 2020 , by Maagulf
జెడ్డాలో సోషల్‌ డిస్టెన్సింగ్‌ పట్ల నిర్లక్ష్యం

సౌదీ పోలీస్‌, పలువురు కార్మికులపై హెల్త్‌ వయొలేషన్స్‌ నేపథ్యంలో కేసులు నమోదు చేశారు. పోర్ట్‌ సిటీ జెడ్డాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఫేస్‌ మాస్క్‌లు ధరించకపోవడం, సోషల్‌ డిస్టెన్సింగ్‌ పాటించకపోవడం వంటి ఉల్లంఘనలకు సంబంధించి వీరిని కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. పోలీస్‌ ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించడం జరుగుతోందనీ, జెడ్డాలోని పలు మార్కెట్‌ ప్లేస్‌లలో తనిఖీలు జరుగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. కాగా, సౌదీ అరేబియా కరోనా లాక్‌డౌన్‌ నుంచి చాలా వెసులుబాట్లు కలిపిస్తూ వస్తోంది. అయితే, ఖచ్చితంగా ప్రికాషన్స్‌ని ప్రతి ఒక్కరూ పాటించాల్సి వుంటుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com