భారత్లో లక్ష దాటిన కరోనా మరణాలు..
- October 03, 2020
న్యూ ఢిల్లీ:భారత్ లో కరోనా దారుణాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఆ దరిద్రపు క్రిమి... జనం ప్రాణాలు తీసేస్తోంది. తాజాగా నిన్న కొత్తగా 79476 మందికి కరోనా సోకింది. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 64,73,544కి చేరింది. అలాగే... నిన్న 1069 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 1,00,846కి చేరింది. దేశంలో మరణాల రేటు 1.6 శాతంగా ఉంది. ప్రపంచ దేశాల్లో అది కాస్త తగ్గి.. 2.97 శాతంగా ఉంది.
భారత్ లో నిన్న 75,628 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం కరోనా రికవరీల సంఖ్య 54,27,706కి చేరింది. దేశంలో రికవరీ రేటు మరింత పెరిగి 83.8 శాతానికి చేరింది. దేశంలో యాక్టివ్ కేసులు ఇప్పుడు 9,44,996 ఉన్నాయి. ఇండియాలో నిన్న 11,32,675 టెస్టులు చేశారు. మొత్తం టెస్టుల సంఖ్య 7,78,50,403కి పెరిగింది.
ప్రస్తుతం మొత్తం కేసుల్లో అమెరికా తర్వాత భారత్ టాప్ 2లో కొనసాగుతోంది. రోజువారీ నమోదవుతున్న కరోనా కేసుల్లో ఇండియా మొదటి స్థానంలో కొనసాగుతోంది. అలాగే... మొత్తం మరణాల్లో అమెరికా, బ్రెజిల్ తర్వాత భారత్... మూడో స్థానంలో ఉంది. రోజువారీ నమోదవుతున్న కరోనా మరణాల్లో ఇండియా మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత అమెరికా, బ్రెజిల్ ఉన్నాయి.
తాజా వార్తలు
- చక్కెర పానీయాల ఎక్సైజ్ పన్నుపై టాక్స్ అథారిటీ క్లారిటీ..!!
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి







