తప్పుడు సమాచారాన్ని షేర్ చేస్తే జైలు శిక్ష: హెచ్చరించిన యూఏఈ

- October 03, 2020 , by Maagulf
తప్పుడు సమాచారాన్ని షేర్ చేస్తే జైలు శిక్ష: హెచ్చరించిన యూఏఈ

యూఏఈ: న్యాయాన్ని తప్పుదారి పట్టించేలా అసత్య ప్రచారాలను షేర్ చేస్తే వారికి జైలు శిక్ష, భారీ జరిమానా తప్పదని ఫెడరల్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరించింది. ఈ మేరకు అధికారిక ట్విట్టర్ అకౌంట్లో ప్రజలకు అవగాహన కల్పించేలా ట్వీట్ చేసింది. న్యాయాన్ని తప్పుదారి పట్టించే ఉద్దేశ్యంతో... వ్యక్తులు, ప్రదేశాలు, వస్తువులు, పరిస్థితులను మార్చేందుకు ప్రయత్నించటం నేరమని పేర్కొంది. అలాగే నేరానికి సంబంధించిన సాక్ష్యాలను దాచినా, నిజం కాదని తెలిసి కూడా వారి విషయంలో తప్పుడు సమాచారాన్ని ఇచ్చినా ఫేడరల్ పీనల్ కోడ్ 266 ప్రకారం జైలు శిక్ష తప్పదని హెచ్చరించింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com