క్రమంగా తగ్గుతున్న కోవిడ్ తీవ్రత..అక్టోబర్ 3న 175 కేసులు నమోదు
- October 03, 2020
ఖతార్ పరిధిలో కోవిడ్ తీవ్రత కొద్ది రోజులుగా క్రమంగా తగ్గుతూ వస్తోంది. గడిచిన 24 గంటల్లో కింగ్డమ్ పరిధిలో కొత్తగా 175 కరోనా కేసులు నమోదవగా, 194 మంది కోలుకున్నట్లు ప్రజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు 1,26,339 మంది కరోనా బారిన పడితే..అందులో 1,23,302 మంది రికవరీ అయ్యారు. కొత్తగా నమోదైన 175 మందిలో 155 కమ్యూనిటీ కేసులు ఉండగా..20 మంది విదేశాల నుంచి తిరిగివచ్చిన వారు ఉన్నట్లు అధికారులు వివరించారు. మరోవైపు గడిచిన 24 గంటల్లో కోవిడ్ తో ఒకరు మృతి చెందారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 83 ఏళ్ల వ్యక్తి చనిపోయినట్లు ప్రకటించారు. దీంతో ఖతార్ లో కోవిడ్ మృతుల సంఖ్య 216కి చేరింది. ఇదిలాఉంటే..గడిచిన 24 గంటల్లో 5,200 మందికి కరోనా టెస్టులు నిర్వహించామని, ఇప్పటివరకు 7,91,424 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్







