క్రమంగా తగ్గుతున్న కోవిడ్ తీవ్రత..అక్టోబర్ 3న 175 కేసులు నమోదు

- October 03, 2020 , by Maagulf
క్రమంగా తగ్గుతున్న కోవిడ్ తీవ్రత..అక్టోబర్ 3న 175 కేసులు నమోదు

ఖతార్ పరిధిలో కోవిడ్ తీవ్రత కొద్ది రోజులుగా క్రమంగా తగ్గుతూ వస్తోంది. గడిచిన 24 గంటల్లో కింగ్డమ్ పరిధిలో కొత్తగా 175 కరోనా కేసులు నమోదవగా, 194 మంది కోలుకున్నట్లు ప్రజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు 1,26,339 మంది కరోనా బారిన పడితే..అందులో 1,23,302 మంది రికవరీ అయ్యారు. కొత్తగా నమోదైన 175 మందిలో 155 కమ్యూనిటీ కేసులు ఉండగా..20 మంది విదేశాల నుంచి తిరిగివచ్చిన వారు ఉన్నట్లు అధికారులు వివరించారు. మరోవైపు గడిచిన 24 గంటల్లో కోవిడ్ తో  ఒకరు మృతి చెందారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 83 ఏళ్ల వ్యక్తి చనిపోయినట్లు ప్రకటించారు. దీంతో ఖతార్ లో కోవిడ్ మృతుల సంఖ్య 216కి చేరింది. ఇదిలాఉంటే..గడిచిన 24 గంటల్లో 5,200 మందికి కరోనా టెస్టులు నిర్వహించామని, ఇప్పటివరకు 7,91,424 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com