క్రమంగా తగ్గుతున్న కోవిడ్ తీవ్రత..అక్టోబర్ 3న 175 కేసులు నమోదు
- October 03, 2020
ఖతార్ పరిధిలో కోవిడ్ తీవ్రత కొద్ది రోజులుగా క్రమంగా తగ్గుతూ వస్తోంది. గడిచిన 24 గంటల్లో కింగ్డమ్ పరిధిలో కొత్తగా 175 కరోనా కేసులు నమోదవగా, 194 మంది కోలుకున్నట్లు ప్రజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు 1,26,339 మంది కరోనా బారిన పడితే..అందులో 1,23,302 మంది రికవరీ అయ్యారు. కొత్తగా నమోదైన 175 మందిలో 155 కమ్యూనిటీ కేసులు ఉండగా..20 మంది విదేశాల నుంచి తిరిగివచ్చిన వారు ఉన్నట్లు అధికారులు వివరించారు. మరోవైపు గడిచిన 24 గంటల్లో కోవిడ్ తో ఒకరు మృతి చెందారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 83 ఏళ్ల వ్యక్తి చనిపోయినట్లు ప్రకటించారు. దీంతో ఖతార్ లో కోవిడ్ మృతుల సంఖ్య 216కి చేరింది. ఇదిలాఉంటే..గడిచిన 24 గంటల్లో 5,200 మందికి కరోనా టెస్టులు నిర్వహించామని, ఇప్పటివరకు 7,91,424 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..







