తెలంగాణ లో కొత్తగా 1949 కరోనా కేసులు
- October 04, 2020
హైదరాబాద్:తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య రెండు లక్షలకు చేరువలో ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1949 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య ఒక లక్షా 99 వేలు దాటిందని.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. శనివారం ఇక్క రోజులో కరోనాతో 10 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 11 వందల 63కి చేరింది. కరోనా నుంచి కోలుకుని శనివారం ఒక్క రోజులో 2 వేల 366 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో లక్షా 70 వేల 212 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 27 వేల 901 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక హైదరాబాద్లో కొత్తగా 291 కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 156, మేడ్చల్లో 150 కొత్త కేసులు నమోదయ్యాయి.. నల్గొండలో 124, కరీంనగర్లో 114 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన