ముందస్తు అనుమతి లేకుండా ఈ విమానాశ్రయం చేరుకోవచ్చు
- October 06, 2020
రస్ అల్ ఖైమా: డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, రస్ అల్ ఖైమా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ద్వారా అక్టోబర్ 15 నుంచి రెసిడెంట్స్ దేశంలోకి ముందస్తు అనుమతి లేకుండా రావొచ్చని పేర్కొంది. అక్టోబర్ 15 నుంచి కొత్త ట్రావెల్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ చర్యలు తీసుకుంటున్నారు. కాగా, కోవిడ్19 టెస్ట్ (ఫలితం నెగెటివ్ అయి వుండాలి) 96 గంటలకు ముందుగా తీసుకుని రావాల్సి వుంది. ట్రావెలర్స్ లేదా స్పాన్సరర్స్ మరో లేబ్ టెస్ట్ లేదా పిసిఆర్ టెస్ట్కి సంబంధించిన ఖర్చు భరించాల్సి వుంటుంది. టూరిస్ట్ మెడికల్ ఇన్స్యూరెన్స్ వుండి, ట్రావెల్ టికెట్ని పొంది వుండి అలాగే తగిన ట్రావెల్ రిక్వైర్మెంట్స్ వుంటే టూరిస్టులకు కూడా ఈ అవకాశం కల్పిస్తారు. వీరికి కూడా పిసిఆర్ టెస్ట్ తప్పనిసరి. ఆయా దేశాలకు సంబంధించిన నియమ నిబంధనలకు అనుగుణంగా రస్ అల్ ఖైమా నుంచి ఎవరైనా ఏ దేశానికి అయినా వెళ్ళడానికి వీలు కలిపిస్తున్నారు.
తాజా వార్తలు
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!
- ఉగ్రవాద ముఠా అరెస్ట్ పై కువైట్ హోంశాఖ క్లారిటీ..!!
- 7రోజుల్లో 18 వేల ఎక్స్ పైరీ ఉత్పత్తులు స్వాధీనం..!!
- జీ20 ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ దేశాల్లో సౌదీకి చోటు..!!
- బహ్రెయిన్ లో విదేశీ వైద్యుల ఆపరేషన్లపై కఠిన నిబంధనలు..!!







