అజ్మన్:మనీ ఎక్సేంజ్ సిబ్బంది నుంచి డబ్బు చోరీ..24 గంటల్లో దొంగల అరెస్ట్
- October 07, 2020
అజ్మన్:ఓ మనీ ఎక్సేంజ్ సిబ్బందిని బెదిరించి వారి నుంచి 32 లక్షల దిర్హామ్ లను ఎత్తుకెళ్లిన కేసులో అజ్మన్ పోలీసులు ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. చోరీ జరిగిన 24 గంటల్లోనే నిందితులను గుర్తించి అరెస్ట్ చేయటం విశేషం. చోరీకి పాల్పడిన వారిలో ముగ్గురు అరబ్బులు ఉండగా ఒకరు గల్ఫ్ దేశస్తుడు. మరో వ్యక్తి ఆసియాకు చెందిన వ్యక్తిగా పోలీసులు వెల్లడించారు. అజ్మన్ పరిధిలోని ఓ మనీ ఎక్సేంజ్ సిబ్బంది..నగదు బదిలీ నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి భద్రత లేకుండా డబ్బును తరలించే ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. ఓ సివిలియన్ కారులో డబ్బు తరలిస్తుండటం..పైగా సెక్యూరిటీ కూడా లేకపోవటానికి గమనించిన ముఠా వారిపై దాడికి పాల్పడింది. ఆయుధాలతో బెదిరించి 32,80,000 దిర్హామ్ లను ముఠా ఎత్తుకెళ్లింది. అయితే..ఈ భారీ చోరీ గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దొంగల ముఠా కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ముఠా సభ్యుల్లో ఒకరు అజ్మన్ లో పట్టుబడటంతో మిగిలిన వారి వివరాలను కూడా సేకరించి వారిని కూడా అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!







