అజ్మన్:మనీ ఎక్సేంజ్ సిబ్బంది నుంచి డబ్బు చోరీ..24 గంటల్లో దొంగల అరెస్ట్
- October 07, 2020
అజ్మన్:ఓ మనీ ఎక్సేంజ్ సిబ్బందిని బెదిరించి వారి నుంచి 32 లక్షల దిర్హామ్ లను ఎత్తుకెళ్లిన కేసులో అజ్మన్ పోలీసులు ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. చోరీ జరిగిన 24 గంటల్లోనే నిందితులను గుర్తించి అరెస్ట్ చేయటం విశేషం. చోరీకి పాల్పడిన వారిలో ముగ్గురు అరబ్బులు ఉండగా ఒకరు గల్ఫ్ దేశస్తుడు. మరో వ్యక్తి ఆసియాకు చెందిన వ్యక్తిగా పోలీసులు వెల్లడించారు. అజ్మన్ పరిధిలోని ఓ మనీ ఎక్సేంజ్ సిబ్బంది..నగదు బదిలీ నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి భద్రత లేకుండా డబ్బును తరలించే ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. ఓ సివిలియన్ కారులో డబ్బు తరలిస్తుండటం..పైగా సెక్యూరిటీ కూడా లేకపోవటానికి గమనించిన ముఠా వారిపై దాడికి పాల్పడింది. ఆయుధాలతో బెదిరించి 32,80,000 దిర్హామ్ లను ముఠా ఎత్తుకెళ్లింది. అయితే..ఈ భారీ చోరీ గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దొంగల ముఠా కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ముఠా సభ్యుల్లో ఒకరు అజ్మన్ లో పట్టుబడటంతో మిగిలిన వారి వివరాలను కూడా సేకరించి వారిని కూడా అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- మిలియన్ల మోసానికి 10 సంవత్సరాల జైలు శిక్ష..!!
- ఒమన్లో OMR 79.8 మిలియన్లకు చేరిన ఇన్సూరెన్స్ చెల్లింపులు..!!
- 11 గంటల ఆలస్యం తర్వాత జైపూర్-దుబాయ్ విమానం రద్దు..!!
- జాతీయ దినోత్సవ వేడుకలకు భద్రతా కట్టుదిట్టం..!!
- కటారాలో ప్రయాణంలో రమదాన్ ఇఫ్తార్..!!
- 40 దేశాల నుండి చికెన్, గుడ్ల దిగుమతుల పై సౌదీ నిషేధం..!!
- 'వాహన్' పోర్టల్లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?









