దుబాయ్:శుక్ర, శనివారాల్లో షిండాఘా టన్నెల్ రోడ్ పాక్షికంగా మూసివేత

- October 08, 2020 , by Maagulf
దుబాయ్:శుక్ర, శనివారాల్లో షిండాఘా టన్నెల్ రోడ్ పాక్షికంగా మూసివేత

దుబాయ్:దైరా నుంచి బుర్ దుబాయ్ వైపే వెళ్లే వాహనదారుల కోసం ఆర్టీఏ అధికారులు కీలక సూచనలు జారీ చేశారు. శుక్ర, శని వారాల్లో అల్ షిండాఘా టన్నెల్ రోడ్డును పాక్షికంగా మూసివేస్తున్నట్లు తమ అధికారిక ట్వీట్టర్ అకౌంట్ ద్వారా వాహనాదారులకు తెలిపారు. శుక్రవారం(అక్టోబర్ 9)  అర్ధరాత్రి 12.30 నుండి ఉదయం 10.30 వరకు, శనివారం అర్ధరాత్రి 12.30 నుండి ఉదయం 8 గంటల వరకు సొరంగం మూసివేయబడుతుందని వివరించారు. దీన్ని గమనించి వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలుగా అల్ మక్తూమ్ వంతెన, అల్ గర్‌హౌడ్ వంతెన ద్వారా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. సొరంగ మార్గం మూసివేత కారణంగా ఆ రూట్లో వెళ్లే కొన్ని బస్సు సర్వీసులు - X13, X02, 8, 95, C01, C03, C07, C09, C18, E306, X23 - ఆలస్యంగా నడిచే అవకాశాలు ఉన్నట్లు ఆర్టీఏ వెల్లడించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com