దుబాయ్:శుక్ర, శనివారాల్లో షిండాఘా టన్నెల్ రోడ్ పాక్షికంగా మూసివేత
- October 08, 2020
దుబాయ్:దైరా నుంచి బుర్ దుబాయ్ వైపే వెళ్లే వాహనదారుల కోసం ఆర్టీఏ అధికారులు కీలక సూచనలు జారీ చేశారు. శుక్ర, శని వారాల్లో అల్ షిండాఘా టన్నెల్ రోడ్డును పాక్షికంగా మూసివేస్తున్నట్లు తమ అధికారిక ట్వీట్టర్ అకౌంట్ ద్వారా వాహనాదారులకు తెలిపారు. శుక్రవారం(అక్టోబర్ 9) అర్ధరాత్రి 12.30 నుండి ఉదయం 10.30 వరకు, శనివారం అర్ధరాత్రి 12.30 నుండి ఉదయం 8 గంటల వరకు సొరంగం మూసివేయబడుతుందని వివరించారు. దీన్ని గమనించి వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలుగా అల్ మక్తూమ్ వంతెన, అల్ గర్హౌడ్ వంతెన ద్వారా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. సొరంగ మార్గం మూసివేత కారణంగా ఆ రూట్లో వెళ్లే కొన్ని బస్సు సర్వీసులు - X13, X02, 8, 95, C01, C03, C07, C09, C18, E306, X23 - ఆలస్యంగా నడిచే అవకాశాలు ఉన్నట్లు ఆర్టీఏ వెల్లడించింది.
తాజా వార్తలు
- యూఏఈ ఉద్యోగులకు అలర్ట్: సెలవుల్లో పని చేయమని బాస్ ఒత్తిడి చేస్తున్నారా?
- సెయింట్ లూయిస్లో NATS ఉచిత వైద్య శిబిరం, రక్తదానం
- తెలంగాణ: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ప్రపంచ దేశాలకు ట్రంప్ వార్నింగ్
- సమిష్టి కృషితోనే స్పోర్ట్స్ మీట్ విజయవంతం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇంటి వద్దకే రైలు పార్సిల్ సేవలు!
- శ్రీవారి పుష్కరిణిలో తెప్పోత్సవాల ట్రయల్ రన్
- రైల్వే అలర్ట్.. మార్చి 1 నుంచి ‘UTS’ యాప్ క్లోజ్
- ఏప్రిల్ 1 నుంచి క్రెడిట్ కార్డ్ కొత్త రూల్స్
- విద్యార్థులకు సోషల్ మీడియా నిషేధమా? ఏపీ కీలక నిర్ణయం









