దుబాయ్:శుక్ర, శనివారాల్లో షిండాఘా టన్నెల్ రోడ్ పాక్షికంగా మూసివేత
- October 08, 2020
దుబాయ్:దైరా నుంచి బుర్ దుబాయ్ వైపే వెళ్లే వాహనదారుల కోసం ఆర్టీఏ అధికారులు కీలక సూచనలు జారీ చేశారు. శుక్ర, శని వారాల్లో అల్ షిండాఘా టన్నెల్ రోడ్డును పాక్షికంగా మూసివేస్తున్నట్లు తమ అధికారిక ట్వీట్టర్ అకౌంట్ ద్వారా వాహనాదారులకు తెలిపారు. శుక్రవారం(అక్టోబర్ 9) అర్ధరాత్రి 12.30 నుండి ఉదయం 10.30 వరకు, శనివారం అర్ధరాత్రి 12.30 నుండి ఉదయం 8 గంటల వరకు సొరంగం మూసివేయబడుతుందని వివరించారు. దీన్ని గమనించి వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలుగా అల్ మక్తూమ్ వంతెన, అల్ గర్హౌడ్ వంతెన ద్వారా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. సొరంగ మార్గం మూసివేత కారణంగా ఆ రూట్లో వెళ్లే కొన్ని బస్సు సర్వీసులు - X13, X02, 8, 95, C01, C03, C07, C09, C18, E306, X23 - ఆలస్యంగా నడిచే అవకాశాలు ఉన్నట్లు ఆర్టీఏ వెల్లడించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!







