కోవిడ్ సవాళ్లపై చర్చించేందుకు సమావేశం కానున్న జీసీసీ ఎయిర్ పోర్ట్ ఎగ్జిక్యూటీవ్స్
- October 08, 2020
మస్కట్:కోవిడ్ 19 నేపథ్యంలో విమానయాన రంగం ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చించేందుకు జీసీసీ సభ్య దేశాల్లోని విమానాశ్రయ ప్రతినిధులు త్వరలోనే సమావేశం కానున్నారు.ఇందుకు ఒమన్ వేదిక కానుంది. సమావేశ వివరాలను వెల్లడించిన ఒమన్ విమానాశ్రయ అధికారులు...తమ అధ్వర్యంలో జరుగుతున్న తొలి సమావేశమని తెలిపారు. ఈ సమావేశంలో జీసీసీ సభ్య దేశాల్లోని పలు విమానాశ్రయాల ఉన్నతాధికారులు హజరవుతారని, కోవిడ్ 19 నేపథ్యంలో విమానయాన రంగం ఎదుర్కుంటున్న సవాళ్లపై చర్చించేందుకు ఇది అత్యున్నత వేదికగా ఉండనుందని వివరించారు. ప్రస్తుత సవాళ్లను ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన చర్యలతో పాటు భవిష్యత్తు లక్ష్యాలపై ఈ సమావేశం నిర్దేశిస్తుందని ఒమన్ ఎయిర్ పోర్ట్ అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!







