గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న దర్శకులు శేఖర్ కమ్ముల

- October 08, 2020 , by Maagulf
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న దర్శకులు శేఖర్ కమ్ముల

హైదరాబాద్ :రాజ్యసభ సభ్యులు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పాల్గొన్న శేఖర్ కమ్ముల గారు , లవ్ స్టోరీ సినిమా షూట్టింగ్ లో భాగంగా మొయినాబాద్ మండలం , కనకమామిడి గ్రామం లో రహదారికి ఇరువైపులా మొక్కలు నాటారు. అనంతరం తను మాట్లాడుతూ ఎంపీ సంతోష్ కుమార్ పర్యావరణ పరిరక్షణకు ఎంతో కృషి చేస్తున్నారు , ఈ కార్యక్రమం ద్వారా మొక్కలు నాటి వాటిని కాపాడే బాధ్యత తీసుకునేలా అవగాహనా కల్పిస్తున్నారు.ఈరోజు పర్యావరణ ప్రేమికులు మొక్కలు నరకడం తట్టుకోలేక ఎంపీ సంతోష్ కుమార్ కి ట్విట్టర్ ద్వారా తెలియజేశారంటే అయన పర్యావరణ ప్రేమికుడిగా ఎంతగా గుర్తింపు పొందారో అర్ధం అవుతుంది.సీఎం కేసీఆర్ కి బాసటగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్ ని ప్రత్యేకంగా అభినందించారు. లవ్ స్టోరీ చిత్ర యూనిట్ గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటాలని కోరారు .

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com