మస్కట్:38 డిగ్రీల టెంపరేచర్ దాటితే పీసీఆర్ టెస్ట్.. ఒమన్ ఎయిర్ పోర్టు ఆదేశాలు
- October 09, 2020
మస్కట్:ఒమన్ చేరుకునే ప్రయాణికులకు జారీ చేసిన మార్గనిర్దేశకాలలో మరో నిబంధనను జత చేశారు విమానాశ్రయ అధికారులు. శరీర ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెల్సియస్ దాటితే..విమాన ప్రయాణానికి ముందే తప్పనిసరిగా కోవిడ్ నిర్ధారణ పరీక్ష పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలని సూచించింది. పరీక్ష ఫలితాలు వచ్చిన తర్వాతే విమాన ప్రయాణానికి అనుమతి ఇస్తామని వెల్లడించింది. ఇప్పటివరకు ఒమన్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఆయా దేశాల నిబంధనల మేరకు ప్రయాణికులు నడుచుకోవాలని సూచించిన విషయం తెలిసిందే. అలాగే ఒమన్ చేరుకునే ప్రయాణికులు విమానాశ్రయానికి చేరుకోగానే కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించుకోవాల్సి వచ్చేది. కానీ, కొత్త సూచనల మేరకు శరీర ఉష్ణోగ్రత 38 డిగ్రీలు దాటితే కోవిడ్ లక్షణాలు ఉన్నా, లేకున్నా ఖచ్చితంగా పీసీఆర్ టెస్ట్ చేయించుకొని ఫలితాలు వచ్చిన తర్వాతే ప్రయాణానికి అనుమతి ఇస్తామని విమానాశ్రయ అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!







