మస్కట్:38 డిగ్రీల టెంపరేచర్ దాటితే పీసీఆర్ టెస్ట్.. ఒమన్ ఎయిర్ పోర్టు ఆదేశాలు
- October 09, 2020
మస్కట్:ఒమన్ చేరుకునే ప్రయాణికులకు జారీ చేసిన మార్గనిర్దేశకాలలో మరో నిబంధనను జత చేశారు విమానాశ్రయ అధికారులు. శరీర ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెల్సియస్ దాటితే..విమాన ప్రయాణానికి ముందే తప్పనిసరిగా కోవిడ్ నిర్ధారణ పరీక్ష పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలని సూచించింది. పరీక్ష ఫలితాలు వచ్చిన తర్వాతే విమాన ప్రయాణానికి అనుమతి ఇస్తామని వెల్లడించింది. ఇప్పటివరకు ఒమన్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఆయా దేశాల నిబంధనల మేరకు ప్రయాణికులు నడుచుకోవాలని సూచించిన విషయం తెలిసిందే. అలాగే ఒమన్ చేరుకునే ప్రయాణికులు విమానాశ్రయానికి చేరుకోగానే కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించుకోవాల్సి వచ్చేది. కానీ, కొత్త సూచనల మేరకు శరీర ఉష్ణోగ్రత 38 డిగ్రీలు దాటితే కోవిడ్ లక్షణాలు ఉన్నా, లేకున్నా ఖచ్చితంగా పీసీఆర్ టెస్ట్ చేయించుకొని ఫలితాలు వచ్చిన తర్వాతే ప్రయాణానికి అనుమతి ఇస్తామని విమానాశ్రయ అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఇంటి వద్దకే రైలు పార్సిల్ సేవలు!
- శ్రీవారి పుష్కరిణిలో తెప్పోత్సవాల ట్రయల్ రన్
- రైల్వే అలర్ట్.. మార్చి 1 నుంచి ‘UTS’ యాప్ క్లోజ్
- ఏప్రిల్ 1 నుంచి క్రెడిట్ కార్డ్ కొత్త రూల్స్
- విద్యార్థులకు సోషల్ మీడియా నిషేధమా? ఏపీ కీలక నిర్ణయం
- తన పేరుతో సేవా సంస్థలు ఏర్పాటు పై కేటీఆర్ స్పందన
- ప్రమాదంలో గ్రామ సచివాలయాలు: పీపుల్స్ పల్స్ అధ్యయనంలో వ్యవస్థాగత వైఫల్యాలు బహిర్గతం
- అదనపు ఛార్జీలపై ఇండియన్ ఎంబసీ క్లారిటీ..!!
- ఖతార్ లో ఆకట్టుకుంటున్న త్రోబ్యాక్ ఫుడ్ ఫెస్టివల్..!!
- డీప్ఫేక్ ఆఫెన్స్ ప్రపొజల్.. అధ్యయనానికి సిఫార్సు..!!









