మస్కట్:38 డిగ్రీల టెంపరేచర్ దాటితే పీసీఆర్ టెస్ట్.. ఒమన్ ఎయిర్ పోర్టు ఆదేశాలు

- October 09, 2020 , by Maagulf
మస్కట్:38 డిగ్రీల టెంపరేచర్ దాటితే పీసీఆర్ టెస్ట్.. ఒమన్ ఎయిర్ పోర్టు ఆదేశాలు

మస్కట్:ఒమన్ చేరుకునే ప్రయాణికులకు జారీ చేసిన మార్గనిర్దేశకాలలో మరో నిబంధనను జత చేశారు విమానాశ్రయ అధికారులు. శరీర ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెల్సియస్ దాటితే..విమాన ప్రయాణానికి ముందే తప్పనిసరిగా కోవిడ్ నిర్ధారణ పరీక్ష పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలని సూచించింది. పరీక్ష ఫలితాలు వచ్చిన తర్వాతే విమాన ప్రయాణానికి అనుమతి ఇస్తామని వెల్లడించింది. ఇప్పటివరకు ఒమన్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఆయా దేశాల నిబంధనల మేరకు ప్రయాణికులు నడుచుకోవాలని సూచించిన విషయం తెలిసిందే. అలాగే ఒమన్ చేరుకునే ప్రయాణికులు విమానాశ్రయానికి చేరుకోగానే కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించుకోవాల్సి వచ్చేది. కానీ, కొత్త సూచనల మేరకు శరీర ఉష్ణోగ్రత 38 డిగ్రీలు దాటితే కోవిడ్ లక్షణాలు ఉన్నా, లేకున్నా ఖచ్చితంగా పీసీఆర్ టెస్ట్ చేయించుకొని ఫలితాలు వచ్చిన తర్వాతే ప్రయాణానికి అనుమతి ఇస్తామని విమానాశ్రయ అధికారులు స్పష్టం చేశారు. ​

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com