బహ్రెయిన్:ఇస్లాంను కించపరిచేలా ట్వీట్ చేసిన మహిళకు ఏడాది జైలుశిక్ష
- October 09, 2020
మనామా:ఇస్లాం మతాన్ని, ఆచారాలను కించపరిచేలా వ్యాఖ్యానించినందుకు ఓ మహిళకు ఏడాది పాటు నాన్-సస్పెండ్ జైలు శిక్ష విధించింది బహ్రెయిన్ లోయర్ క్రిమినల్ కోర్టు. శిక్ష పడిన మహిళ తన ట్విట్టర అకౌంట్లో ఇస్లాం మత ఆచారాలపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిందని యాంటీ సైబర్ క్రైమ్ అధికారులు గుర్తించారు. దీంతో ఆమె ట్విట్టర్ అకౌంట్ వివరాలను పబ్లిక్ ప్రాసిక్యూషన్ దృష్టికి తీసుకువెళ్లింది. ఇస్లాం మత ఆచారాలను కించపరిచేలా ఆమె వ్యాఖ్యానించినట్లు వివరించింది. దీనిపై దర్యాప్తు జరిపించిన పబ్లిక్ ప్రాసిక్యూషన్..ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు మహిళ నేరానికి పాల్పడినట్లు ప్రాధమికంగా నిర్ధారించుకుంది. ఆమె కస్టడీలోకి తీసుకోవాలని ఆదేశించింది. అనంతరం న్యాయ విచారణ చేపట్టి ఆ మహిళకు ఏడాది పాటు నాన్-సస్పెండ్ జైలు శిక్ష విధిస్తున్నట్లు తీర్పు వెలువరించింది.
తాజా వార్తలు
- ప్రమాదంలో గ్రామ సచివాలయాలు: పీపుల్స్ పల్స్ అధ్యయనంలో వ్యవస్థాగత వైఫల్యాలు బహిర్గతం
- అదనపు ఛార్జీలపై ఇండియన్ ఎంబసీ క్లారిటీ..!!
- ఖతార్ లో ఆకట్టుకుంటున్న త్రోబ్యాక్ ఫుడ్ ఫెస్టివల్..!!
- డీప్ఫేక్ ఆఫెన్స్ ప్రపొజల్.. అధ్యయనానికి సిఫార్సు..!!
- అత్యవసర విదేశాంగ మంత్రివర్గ సమావేశానికి OIC పిలుపు..!!
- యూఏఈలో ఈద్ అల్ ఫితర్ సెలవులు.. డేట్స్ అనౌన్స్..!!
- కువైట్ లో మేజర్ సెక్యూరిటీ డ్రైవ్..!!
- ప్రధాని పై ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు
- తేజస్ జెట్ ప్రమాదం పై ఎయిర్ ఫోర్స్ దర్యాప్తు ప్రారంభం
- TANA అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం









