బహ్రెయిన్:ఇస్లాంను కించపరిచేలా ట్వీట్ చేసిన మహిళకు ఏడాది జైలుశిక్ష
- October 09, 2020
మనామా:ఇస్లాం మతాన్ని, ఆచారాలను కించపరిచేలా వ్యాఖ్యానించినందుకు ఓ మహిళకు ఏడాది పాటు నాన్-సస్పెండ్ జైలు శిక్ష విధించింది బహ్రెయిన్ లోయర్ క్రిమినల్ కోర్టు. శిక్ష పడిన మహిళ తన ట్విట్టర అకౌంట్లో ఇస్లాం మత ఆచారాలపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిందని యాంటీ సైబర్ క్రైమ్ అధికారులు గుర్తించారు. దీంతో ఆమె ట్విట్టర్ అకౌంట్ వివరాలను పబ్లిక్ ప్రాసిక్యూషన్ దృష్టికి తీసుకువెళ్లింది. ఇస్లాం మత ఆచారాలను కించపరిచేలా ఆమె వ్యాఖ్యానించినట్లు వివరించింది. దీనిపై దర్యాప్తు జరిపించిన పబ్లిక్ ప్రాసిక్యూషన్..ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు మహిళ నేరానికి పాల్పడినట్లు ప్రాధమికంగా నిర్ధారించుకుంది. ఆమె కస్టడీలోకి తీసుకోవాలని ఆదేశించింది. అనంతరం న్యాయ విచారణ చేపట్టి ఆ మహిళకు ఏడాది పాటు నాన్-సస్పెండ్ జైలు శిక్ష విధిస్తున్నట్లు తీర్పు వెలువరించింది.
తాజా వార్తలు
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!
- ఉగ్రవాద ముఠా అరెస్ట్ పై కువైట్ హోంశాఖ క్లారిటీ..!!
- 7రోజుల్లో 18 వేల ఎక్స్ పైరీ ఉత్పత్తులు స్వాధీనం..!!







