కువైట్:యజమాని ఇంట్లో KD 11,000 చోరీ..ఐదుగురు గృహకార్మికుల అరెస్ట్
- October 09, 2020
కువైట్ సిటీ:11,000 కువైట్ దినార్ లను దొంగిలించిన కేసులో అసియాకు చెందిన ఐదుగురు గృహ కార్మికులను అరెస్ట్ చేశారు పోలీసులు.కువైట్ లోని ఓ ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించారు. కంప్లైంట్ చేసిన సదరు యజమాని తన బెడ్రూంలో పెట్టిన 11,000 కువైట్ దినార్లు భద్రపరిచినట్లు, ఆ విషయంలో తన ఇంట్లో పని చేసేవారికి కూడా తెలుసని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే..పోలీసుల విచారణలో అరెస్టైన ఆ ఐదుగురు తమకు ఏ పాపం తెలియదని..తాము డబ్బు దొంగిలించలేదని తెలిపారు. మరోవైపు డబ్బు దాటిపెట్టిన బెడ్రూంలో ఫోరెన్సిక్ అధికారులు వేలి ముద్రలను సేకరించారు. ఇదిలాఉంటే..మరో ఘటనలో తన ఇంటికి కన్నం వేసి ఓ అంగతకుడు పరుపు కింద దాచిన 1,430 దినార్లను దోచుకెళ్లినట్లు ఈజిప్ట్ కు చెందిన వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హవాలి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. దర్యాప్తు చేపట్టిన అధికారులు..ఇంటి పరిసరాల్లో వేలి ముద్రలను సేకరించారు.
తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్







