కువైట్:యజమాని ఇంట్లో KD 11,000 చోరీ..ఐదుగురు గృహకార్మికుల అరెస్ట్
- October 09, 2020
కువైట్ సిటీ:11,000 కువైట్ దినార్ లను దొంగిలించిన కేసులో అసియాకు చెందిన ఐదుగురు గృహ కార్మికులను అరెస్ట్ చేశారు పోలీసులు.కువైట్ లోని ఓ ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించారు. కంప్లైంట్ చేసిన సదరు యజమాని తన బెడ్రూంలో పెట్టిన 11,000 కువైట్ దినార్లు భద్రపరిచినట్లు, ఆ విషయంలో తన ఇంట్లో పని చేసేవారికి కూడా తెలుసని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే..పోలీసుల విచారణలో అరెస్టైన ఆ ఐదుగురు తమకు ఏ పాపం తెలియదని..తాము డబ్బు దొంగిలించలేదని తెలిపారు. మరోవైపు డబ్బు దాటిపెట్టిన బెడ్రూంలో ఫోరెన్సిక్ అధికారులు వేలి ముద్రలను సేకరించారు. ఇదిలాఉంటే..మరో ఘటనలో తన ఇంటికి కన్నం వేసి ఓ అంగతకుడు పరుపు కింద దాచిన 1,430 దినార్లను దోచుకెళ్లినట్లు ఈజిప్ట్ కు చెందిన వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హవాలి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. దర్యాప్తు చేపట్టిన అధికారులు..ఇంటి పరిసరాల్లో వేలి ముద్రలను సేకరించారు.
తాజా వార్తలు
- వాహనాల పైకప్పుల పై కూర్చోవడం డేంజర్, క్రైమ్..!!
- సోహార్లో చోరీ కేసులో ఇద్దరు అరెస్టు..!!
- దుబాయ్ లో బెగ్గర్ అరెస్ట్.. నగదు చూసి పోలీసులు షాక్..!!
- సౌదీ అరేబియాలో 14,893 మంది బహిష్కరణ..!!
- ట్రాన్సిట్, టూరిజం పాలసీపై సమీక్షకు సన్నాహాలు..!!
- ప్రవాసుల లా సేవల పై కువైట్ బార్ అసోసియేషన్ సీరియస్..!!
- భారతీయ విశ్వవిద్యాలయాలు ‘రోబోడాగ్’ నుంచి ఏం నేర్చుకోవాలి: BITS వైస్ ఛాన్సలర్ రాంగోపాల్ రావు
- ట్రంప్ టారిఫ్ దెబ్బ, దిగుమతుల పై 15% సుంకం ప్రకటింపు
- టీబీజేపీ ప్రెసిడెంట్ రాంచందర్ రావు అరెస్ట్..
- శ్రీశైలంలో అగ్ని ప్రమాదం, భక్తులకు తప్పిన పెను ప్రమాదం









