కువైట్:యజమాని ఇంట్లో KD 11,000 చోరీ..ఐదుగురు గృహకార్మికుల అరెస్ట్
- October 09, 2020
కువైట్ సిటీ:11,000 కువైట్ దినార్ లను దొంగిలించిన కేసులో అసియాకు చెందిన ఐదుగురు గృహ కార్మికులను అరెస్ట్ చేశారు పోలీసులు.కువైట్ లోని ఓ ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించారు. కంప్లైంట్ చేసిన సదరు యజమాని తన బెడ్రూంలో పెట్టిన 11,000 కువైట్ దినార్లు భద్రపరిచినట్లు, ఆ విషయంలో తన ఇంట్లో పని చేసేవారికి కూడా తెలుసని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే..పోలీసుల విచారణలో అరెస్టైన ఆ ఐదుగురు తమకు ఏ పాపం తెలియదని..తాము డబ్బు దొంగిలించలేదని తెలిపారు. మరోవైపు డబ్బు దాటిపెట్టిన బెడ్రూంలో ఫోరెన్సిక్ అధికారులు వేలి ముద్రలను సేకరించారు. ఇదిలాఉంటే..మరో ఘటనలో తన ఇంటికి కన్నం వేసి ఓ అంగతకుడు పరుపు కింద దాచిన 1,430 దినార్లను దోచుకెళ్లినట్లు ఈజిప్ట్ కు చెందిన వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హవాలి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. దర్యాప్తు చేపట్టిన అధికారులు..ఇంటి పరిసరాల్లో వేలి ముద్రలను సేకరించారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు