మస్కట్:బీచ్ లను మూసివేసిన సుప్రీం కమిటీ..మళ్లీ ప్రకటించే వరకు బీచ్ బంద్
- October 10, 2020
మస్కట్:కోవిడ్ తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో బీచ్ లను పూర్తిగా మూసివేస్తున్నట్లు ఒమన్ ప్రభుత్వం ప్రకటించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని వెల్లడించింది. అంతేకాదు..అన్ లాక్ లో భాగంగా గతంలో కొన్ని కార్యకలాపాలను ఇచ్చిన అనుమతులను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు అనుగుణంగా..తగిన జాగ్రత్తలు తీసుకోకవటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అంతేకాదు..నిబంధనలు ఉల్లంఘించిన వారి ఫోటోలు, పేర్లు త్వరలోనే ప్రతికల ద్వారా వెల్లడిస్తామని అన్నారు. ఇదిలాఉంటే..కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా ఆక్టోబర్ 11 నుంచి అక్టోబర్ 24 వరకు పాక్షిక కర్ఫ్యూ అమలు చేస్తున్నామని, రాత్రి 8 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఎవరూ బయటికి రావొద్దని హెచ్చరించారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు