కువైట్:కర్ఫ్యూ విధింపు ప్రచారాన్ని కొట్టిపారేసిన ఆరోగ్య శాఖ మంత్రి
- October 11, 2020
కువైట్ సిటీ:కువైట్ లో మళ్లీ కర్ఫ్యూ విధిస్తారన్న ప్రచారాన్ని ఆరోగ్య శాఖ మంత్రి కొట్టిపారేశారు. దేశంలో కరోనా తీవ్రత కొనసాగుతుండటంతో ప్రభుత్వం మళ్లీ పాక్షికంగా కర్ఫ్యూ విధిస్తోందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు. హెల్త్ మినిస్ట్రి ఆధ్వర్యంలో శనివారమే మీటింగ్ జరిగిందని, ఆ సమావేశంలో అధికారులు పాక్షిక కర్ఫ్యూ విధింపు అవసమని నివేదిక ఇచ్చినట్లు కొందరు రూమర్లు సృష్టించారు. వచ్చే వారం నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందంటూ పోస్టులు పెట్టారు. ఈ విషయం కాస్తా ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి వెళ్లటంతో పాక్షిక కర్ఫ్యూ విధింపుపై స్పష్టత ఇచ్చిన ఆయన..అసలు శనివారం సమావేశమే జరగలేదని చెప్పారు. షెడ్యూల్ ప్రకారం ఆక్టోబర్ 11న (ఆదివారం) సమావేశం జరుగుతుందని..దేశంలో ప్రస్తుతం కరోనా పరిస్థితి ఇవాళ్టి సమావేశంలో చర్చిస్తామని మంత్రి క్లారిటీ ఇచ్చారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!







