కువైట్:కర్ఫ్యూ విధింపు ప్రచారాన్ని కొట్టిపారేసిన ఆరోగ్య శాఖ మంత్రి
- October 11, 2020
కువైట్ సిటీ:కువైట్ లో మళ్లీ కర్ఫ్యూ విధిస్తారన్న ప్రచారాన్ని ఆరోగ్య శాఖ మంత్రి కొట్టిపారేశారు. దేశంలో కరోనా తీవ్రత కొనసాగుతుండటంతో ప్రభుత్వం మళ్లీ పాక్షికంగా కర్ఫ్యూ విధిస్తోందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు. హెల్త్ మినిస్ట్రి ఆధ్వర్యంలో శనివారమే మీటింగ్ జరిగిందని, ఆ సమావేశంలో అధికారులు పాక్షిక కర్ఫ్యూ విధింపు అవసమని నివేదిక ఇచ్చినట్లు కొందరు రూమర్లు సృష్టించారు. వచ్చే వారం నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందంటూ పోస్టులు పెట్టారు. ఈ విషయం కాస్తా ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి వెళ్లటంతో పాక్షిక కర్ఫ్యూ విధింపుపై స్పష్టత ఇచ్చిన ఆయన..అసలు శనివారం సమావేశమే జరగలేదని చెప్పారు. షెడ్యూల్ ప్రకారం ఆక్టోబర్ 11న (ఆదివారం) సమావేశం జరుగుతుందని..దేశంలో ప్రస్తుతం కరోనా పరిస్థితి ఇవాళ్టి సమావేశంలో చర్చిస్తామని మంత్రి క్లారిటీ ఇచ్చారు.
తాజా వార్తలు
- T20 వరల్డ్ కప్ 2026: ఒమన్ పై ఆస్ట్రేలియా ఘన విజయం
- టీటీడీలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- మేకపాటి గౌతమ్ పేరుతో ధ్యాన మందిరం
- డొనాల్డ్ ట్రంప్కి బిగ్ షాక్..
- హైవే పై గ్యాస్ ట్యాంకర్ పేలుడు
- ‘PhonePe’లో అదిరిపోయే ఫీచర్!
- మదీనాలో ఆరోగ్య , వాణిజ్య కార్యకలాపాలలో తనిఖీలు..!!
- మూడు ప్రైవేట్ ఫార్మసీల లైసెన్సులు రద్దు..!!
- BD4,633 సైక్లింగ్..ప్రవాసురాలికి జైలుశిక్ష ఖరారు..!!
- యూఏఈలో లైసెన్స్ లేని, నకిలీ సంస్థలను ఎలా గుర్తించాలి?









