బాకు:రాకెట్ దాడిలో ఏడుగురు మృతి..

- October 11, 2020 , by Maagulf
బాకు:రాకెట్ దాడిలో ఏడుగురు మృతి..

బాకు:ఆర్మేనియా, అజ‌ర్‌బైజాన్ దేశాల మ‌ధ్య యుద్ధం కొన‌సాగుతున్న‌ది. ఆదివారం తెల్ల‌వారుజామున‌ అజ‌ర్‌బైజాన్‌లోని గంజా న‌గ‌రంపై ఆర్మేనియా రాకెట్ దాడికి పాల్ప‌డింది. ఈ దాడిలో గంజాలోని ఓ భ‌వ‌నం పూర్తిగా ధ్వంస‌మైంది. దాంతో ఆ భ‌వ‌నంలోని ఏడుగురు వ్య‌క్తులు అక్క‌డిక‌క్క‌డే మృతిచెందారు. మ‌రో 33 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. క్ష‌త‌గాత్రుల్లో ప‌లువురు చిన్నారులు కూడా ఉన్నారు. అజ‌ర్‌బైజాన్ విదేశాంగ శాఖ ఈ వివరాల‌ను వెల్ల‌డించింది. అయితే అజ‌ర్‌బైజాన్ ఆరోప‌ణ‌ల‌ను ఆర్మేనియా కొట్టిపారేసింది. కాగా, న‌గొర్నో క‌ర‌బ‌క్ విష‌య‌మై ఆర్మేనియా, అజ‌ర్‌బైజాన్ మ‌ధ్య గ‌త కొన్ని రోజులుగా యుద్ధం జ‌రుగుతున్న‌ది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com