బాకు:రాకెట్ దాడిలో ఏడుగురు మృతి..
- October 11, 2020
బాకు:ఆర్మేనియా, అజర్బైజాన్ దేశాల మధ్య యుద్ధం కొనసాగుతున్నది. ఆదివారం తెల్లవారుజామున అజర్బైజాన్లోని గంజా నగరంపై ఆర్మేనియా రాకెట్ దాడికి పాల్పడింది. ఈ దాడిలో గంజాలోని ఓ భవనం పూర్తిగా ధ్వంసమైంది. దాంతో ఆ భవనంలోని ఏడుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 33 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో పలువురు చిన్నారులు కూడా ఉన్నారు. అజర్బైజాన్ విదేశాంగ శాఖ ఈ వివరాలను వెల్లడించింది. అయితే అజర్బైజాన్ ఆరోపణలను ఆర్మేనియా కొట్టిపారేసింది. కాగా, నగొర్నో కరబక్ విషయమై ఆర్మేనియా, అజర్బైజాన్ మధ్య గత కొన్ని రోజులుగా యుద్ధం జరుగుతున్నది.
తాజా వార్తలు
- రాకేష్ బోద్ధులకు 'వంశీ విశ్వనాథ్ కళా తపస్వి’ జాతీయ పురస్కార ప్రదానం
- ఏపీ మోడల్ స్కూల్స్ ల్లో ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లు జాగ్రత్త..
- యూట్యూబర్ అన్వేష్ కు బిగ్ షాక్
- హైదరాబాద్లో అనిరుధ్ కాన్సర్ట్, టికెట్లకు భారీ పోటీ!
- బ్రహ్మోత్సవాలకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు యాదాద్రి ఈఓ ఆహ్వానం
- కింగ్ ఫహద్ కాజ్వే పై టోల్ బాదుడు షురూ..!!
- ట్రాఫిక్ డిపార్టుమెంట్ కు కొత్త వర్కింగ్ అవర్స్..!!
- విద్యాసంస్థలకు మద్దతుగా మెడికల్ ఇక్విప్ మెంట్..!!
- ప్రపంచ వారసత్వ జాబితాలో ఒమన్ సైట్లకు చోటు..!!









