కోవిడ్ 19: ఒమన్ లో పాక్షిక కర్ఫ్యూ..మస్కట్-సలాహ్ బస్సు సర్వీసులు రద్దు

- October 11, 2020 , by Maagulf
కోవిడ్ 19: ఒమన్ లో పాక్షిక కర్ఫ్యూ..మస్కట్-సలాహ్ బస్సు సర్వీసులు రద్దు

మస్కట్:దేశంలో కరోనా తీవ్రత మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో సుప్రీం కమిటీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆక్టోబర్ 11 నుంచి 24 వరకు నైట్ లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించింది. అన్ని పబ్లిక్ ప్లేసులు, షాపులు రాత్రి 8 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు మూసివేయాలని ఆదేశించింది. లాక్డౌన్ అమలులో సమయంలో ఎవరూ బయటికి రావొద్దని హెచ్చరించింది. నైట్ లాక్డౌన్ అమలులోకి రావటంతో..ప్రజా రవాణా వ్యవస్థల టైమింగ్స్ ను రీషెడ్యూల్ చేశారు. మస్కట్-సలాహ్ మధ్య బస్సు సర్వీసును రద్దు చేస్తున్నట్లు ఒమన్ జాతీయ రవాణా సంస్థ ఎంవసలాత్ తెలిపింది. ఇక మస్కట్ సిటీ, ఇంటర్ సిటీ(సలాహ్ మినహా) సర్వీసులు సాయంత్రం 6 గంటలలోగా గమ్యస్థానాలకు చేరుకుంటాయని, అలాగే నేషనల్ ఫెర్రీస్ కూడా సాయంత్రం 6 గంటల వరకే ఉంటాయని తెలిపింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు పాక్షిక లాక్డౌన్ అమలులో ఉంటుందన్నారు. 

--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com