కోవిడ్ 19: ఒమన్ లో పాక్షిక కర్ఫ్యూ..మస్కట్-సలాహ్ బస్సు సర్వీసులు రద్దు
- October 11, 2020
మస్కట్:దేశంలో కరోనా తీవ్రత మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో సుప్రీం కమిటీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆక్టోబర్ 11 నుంచి 24 వరకు నైట్ లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించింది. అన్ని పబ్లిక్ ప్లేసులు, షాపులు రాత్రి 8 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు మూసివేయాలని ఆదేశించింది. లాక్డౌన్ అమలులో సమయంలో ఎవరూ బయటికి రావొద్దని హెచ్చరించింది. నైట్ లాక్డౌన్ అమలులోకి రావటంతో..ప్రజా రవాణా వ్యవస్థల టైమింగ్స్ ను రీషెడ్యూల్ చేశారు. మస్కట్-సలాహ్ మధ్య బస్సు సర్వీసును రద్దు చేస్తున్నట్లు ఒమన్ జాతీయ రవాణా సంస్థ ఎంవసలాత్ తెలిపింది. ఇక మస్కట్ సిటీ, ఇంటర్ సిటీ(సలాహ్ మినహా) సర్వీసులు సాయంత్రం 6 గంటలలోగా గమ్యస్థానాలకు చేరుకుంటాయని, అలాగే నేషనల్ ఫెర్రీస్ కూడా సాయంత్రం 6 గంటల వరకే ఉంటాయని తెలిపింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు పాక్షిక లాక్డౌన్ అమలులో ఉంటుందన్నారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- రాకేష్ బోద్ధులకు 'వంశీ విశ్వనాథ్ కళా తపస్వి’ జాతీయ పురస్కార ప్రదానం
- ఏపీ మోడల్ స్కూల్స్ ల్లో ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లు జాగ్రత్త..
- యూట్యూబర్ అన్వేష్ కు బిగ్ షాక్
- హైదరాబాద్లో అనిరుధ్ కాన్సర్ట్, టికెట్లకు భారీ పోటీ!
- బ్రహ్మోత్సవాలకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు యాదాద్రి ఈఓ ఆహ్వానం
- కింగ్ ఫహద్ కాజ్వే పై టోల్ బాదుడు షురూ..!!
- ట్రాఫిక్ డిపార్టుమెంట్ కు కొత్త వర్కింగ్ అవర్స్..!!
- విద్యాసంస్థలకు మద్దతుగా మెడికల్ ఇక్విప్ మెంట్..!!
- ప్రపంచ వారసత్వ జాబితాలో ఒమన్ సైట్లకు చోటు..!!









