కువైట్ పర్యటనలో భారత కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్..ఈ రోజు అధికారులతో భేటీ
- October 12, 2020
కువైట్ సిటీ:భారత పెట్రోలియం, నేచురల్ గ్యాస్ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ కువైట్ పర్యటనలో ఉన్నారు. ఆయన ఈ రోజు అధికారిక సమావేశంలో పాల్గొంటారు. ఇటీవలె కన్నుమూసిన కువైట్ అమీర్ షేక్ సబా అల్-అహ్మద్ అల్-జాబెర్ అల్-సబా మృతికి సంతాపం తెలుపుతు భారత రాష్ట్రపతి, ప్రధాని పంపిన లేఖలను కువైట్ పాలకులకు అందజేస్తారు. అలాగే కువైట్ కొత్త అమీర్ గా బాధ్యతలు స్వీకరించిన షేక్ నవాఫ్ అల్-అహ్మద్ అల్-జాబెర్ అల్-సబాతో పాటు క్రౌన్ ప్రిన్స్ షేక్ మిషేల్ అల్-అహ్మద్ అల్-జాబెర్ అల్-సబాకు భారత ప్రభుత్వం తరపున కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ శుభాకాంక్షలు తెలుపుతారు. ఇదిలాఉంటే..నిన్న సాయంత్రం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న కేంద్రమంత్రికి కువైట్ విద్యుత్, నీరు, చమురు శాఖ మంత్రి డాక్టర్ ఖలీద్ అలీ అల్ ఫదాల్ సాదరంగా స్వాగతం పలికారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

తాజా వార్తలు
- నెదర్లాండ్స్ పై భారత్ విజయం
- హైదరాబాద్లో హాట్ కేకుల్లా అమ్ముడైన హౌసింగ్ బోర్డు ప్లాట్లు
- ఏపీ: ఫిబ్రవరి 24న మంత్రివర్గ సమావేశం
- ఏప్రిల్ లో ముంబైలో ఘనంగా తొలి INCA అవార్డులు వేడుక
- సోషల్ మీడియాలో ‘ఓవర్ షేరింగ్’ చేస్తే డేంజర్ లో పడినట్లే!!
- రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల..
- తెలంగాణ వైద్యారోగ్య శాఖలో సరికొత్త స్కామ్!
- ప్రధాని నరేంద్ర మోదీతో సుందర్ పిచాయ్ భేటీ
- కువైట్ అంతటా మస్జీదుల్లో సందడి..!!
- అనుచిత సోషల్ మీడియా పోస్ట్ లపై స్కూల్స్ వార్న్..!!









