కువైట్ పర్యటనలో భారత కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్..ఈ రోజు అధికారులతో భేటీ
- October 12, 2020
కువైట్ సిటీ:భారత పెట్రోలియం, నేచురల్ గ్యాస్ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ కువైట్ పర్యటనలో ఉన్నారు. ఆయన ఈ రోజు అధికారిక సమావేశంలో పాల్గొంటారు. ఇటీవలె కన్నుమూసిన కువైట్ అమీర్ షేక్ సబా అల్-అహ్మద్ అల్-జాబెర్ అల్-సబా మృతికి సంతాపం తెలుపుతు భారత రాష్ట్రపతి, ప్రధాని పంపిన లేఖలను కువైట్ పాలకులకు అందజేస్తారు. అలాగే కువైట్ కొత్త అమీర్ గా బాధ్యతలు స్వీకరించిన షేక్ నవాఫ్ అల్-అహ్మద్ అల్-జాబెర్ అల్-సబాతో పాటు క్రౌన్ ప్రిన్స్ షేక్ మిషేల్ అల్-అహ్మద్ అల్-జాబెర్ అల్-సబాకు భారత ప్రభుత్వం తరపున కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ శుభాకాంక్షలు తెలుపుతారు. ఇదిలాఉంటే..నిన్న సాయంత్రం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న కేంద్రమంత్రికి కువైట్ విద్యుత్, నీరు, చమురు శాఖ మంత్రి డాక్టర్ ఖలీద్ అలీ అల్ ఫదాల్ సాదరంగా స్వాగతం పలికారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్







