'మహాసముద్రం'లో హీరోయిన్గా అదితి రావ్ హైదరి
- October 12, 2020
ఒక్కో అనౌన్స్మెంట్తో 'మహాసముద్రం' చిత్రం ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింతగా పెంచుకుంటూ వస్తోంది. శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా నటిస్తోన్న ఈ సినిమాని 'ఆర్ఎక్స్ 100' ఫేమ్ అజయ్ భూపతి డైరెక్ట్ చేస్తున్నారు.
లేటెస్ట్గా ఈ ఫిల్మ్కు సంబంధించి మరో ఆసక్తికర అనౌన్స్మెంట్ వచ్చింది. అందచందాలతో పాటు అభినయ సామర్థ్యం పుష్కలంగా ఉన్న తారగా ఇటు ప్రేక్షకుల, అటు విమర్శకుల ప్రశంసలు పొందుతున్న అదితి రావ్ హైదరి ఇందులో హీరోయిన్గా ఎంపికయ్యారు.
పర్ఫార్మెన్స్కు బాగా స్కోప్ ఉన్న ఆ కీలక పాత్రకు పలువురి తారల పేర్లను పరిశీలించాక, అదితి రావ్ అయితే ఆ పాత్రకు న్యాయం జరుగుతుందని దర్శక నిర్మాతలు భావించారు. ఈ ప్రాజెక్టులో భాగం కావడంతో అదితి రావ్ సైతం ఆనందం వ్యక్తం చేశారు.
ఇంటెన్స్ లవ్ అండ్ యాక్షన్ డ్రామా అయిన 'మహాసముద్రం'ను ఎ.కె. ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు.
తారాగణం:
శర్వానంద్, సిద్ధార్థ్, అదితి రావ్ హైదరి
సాంకేతిక బృందం:
దర్శకుడు: అజయ్ భూపతి
నిర్మాత: సుంకర రామబ్రహ్మం
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!