హైదరాబాద్:ఇంటి ఓనర్ భార్య చేతులు కట్టేసి.. పనిమనిషి దోపిడీ..
- October 12, 2020
హైదరాబాద్:హైదరాబాద్లో చోరీలకు పాల్పడుతున్న నేపాల్ గ్యాంగ్ను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని బీఎన్రెడ్డి కాలనీలో వారంరోజుల క్రితం జరిగిన దొంగతనాన్ని చేధించడం జరిగిందని సీపీ సజ్జనార్ తెలిపారు. నేపాల్ దొంగల ముఠాకు చెందిన ముగ్గురిని ఆదుపులోకి తీసుకున్నారు. మరో ఆరుగురు పరారీలో ఉన్నారని పేర్కొన్నారు. వారి నుంచి 5లక్షల నగదుతో పాటు.. 3వందల గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాంట్రాక్టర్ గూడూరు మధుసూదన్రెడ్డి ఇంట్లో ఈనెల 5న చోరీ జరిగింది. నేపాల్కు చెందిన జానకి... మధుసూదన్రెడ్డి ఇంట్లో పనిమనిషిగా పని చేస్తోంది. ఐతే ప్లాన్ ప్రకారం ఆహార పదార్ధాల్లో మత్తుమందు కలపడంతో అంతా నిద్రమత్తులోకి వెళ్లారు. మధుసూదన్రెడ్డి భార్య తినకపోవడంతో.. అమె చేతులు కట్టేసి మిగతా సభ్యులతో కలిసి దోపిడీకి పాల్పడ్డారు. కేసు దర్యాప్తులో భాగంగా పది టీమ్లను ఏర్పాటు చేసి.. వీరిని పట్టుకున్నట్టు సీపీ సజ్జనార్ తెలిపారు. ఎవరినైనా ఇంట్లో పనికి పెట్టుకునేటప్పుడు వారి పూర్తి వివరాలు తెలుసుకోవాలని సీపీ సూచించారు.



తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







