నిండుసభలో కన్నీళ్లు పెట్టుకున్న కొరియా నియంత
- October 12, 2020
నియంత కిమ్ జోంగ్ ఉన్ ఎప్పుడు ఎలా ఉంటాడో ఎవరికీ అర్ధం కాదు. కొన్ని సార్లు తనను రెచ్చగొడితే బాగుండదు అని వివిధ దేశాలకు వార్నింగ్ ఇస్తుంటాడు. మరోసారి అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అన్నట్టుగా ప్రవర్తిస్తుంటాడు. తాజాగా ఉత్తర కొరియాలో జరిగిన పరేడ్ సమయంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన కిమ్.. కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రజలు తనపై పెట్టుకున్న ఆశలను నెరవేర్చలేకపోయినందుకు సిగ్గుపడుతున్నానని తెలిపాడు.
దేశంలో ఎవరికీ కరోనావైరస్ సోకకపోవడం అనేది సంతోషాన్ని కలిగించే అంశం అని..ప్రస్తుతం ఉన్న సమస్యల నుంచి దేశాన్ని గట్టెక్కిండానికి అన్ని ప్రయత్నాలు చేస్తానని తెలిపాడు కిమ్. అదే సమయంలో ఇప్పటి దాకా తను ప్రయత్నం చేసి సాధించలేని అంశాల విషయంలో సిగ్గుపడుతున్నాని అని తెలిపాడు. దేశ రక్షణ వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేస్తానని స్పష్టం చేశాడు.
తను స్పీచు ముగించే సమయంలో కరోనావైరస్ ప్రమాదం నుంచి ప్రపంచం బయటపడిన తరువాత ఉత్తర కొరియా, దక్షిణ కొరియా దేశాల మధ్య బంధం మరింత పటిష్టం అయ్యేలా ప్రయత్నిస్తానని తెలిపాడు కిమ్.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!