నిండుసభలో కన్నీళ్లు పెట్టుకున్న కొరియా నియంత
- October 12, 2020
నియంత కిమ్ జోంగ్ ఉన్ ఎప్పుడు ఎలా ఉంటాడో ఎవరికీ అర్ధం కాదు. కొన్ని సార్లు తనను రెచ్చగొడితే బాగుండదు అని వివిధ దేశాలకు వార్నింగ్ ఇస్తుంటాడు. మరోసారి అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అన్నట్టుగా ప్రవర్తిస్తుంటాడు. తాజాగా ఉత్తర కొరియాలో జరిగిన పరేడ్ సమయంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన కిమ్.. కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రజలు తనపై పెట్టుకున్న ఆశలను నెరవేర్చలేకపోయినందుకు సిగ్గుపడుతున్నానని తెలిపాడు.
దేశంలో ఎవరికీ కరోనావైరస్ సోకకపోవడం అనేది సంతోషాన్ని కలిగించే అంశం అని..ప్రస్తుతం ఉన్న సమస్యల నుంచి దేశాన్ని గట్టెక్కిండానికి అన్ని ప్రయత్నాలు చేస్తానని తెలిపాడు కిమ్. అదే సమయంలో ఇప్పటి దాకా తను ప్రయత్నం చేసి సాధించలేని అంశాల విషయంలో సిగ్గుపడుతున్నాని అని తెలిపాడు. దేశ రక్షణ వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేస్తానని స్పష్టం చేశాడు.
తను స్పీచు ముగించే సమయంలో కరోనావైరస్ ప్రమాదం నుంచి ప్రపంచం బయటపడిన తరువాత ఉత్తర కొరియా, దక్షిణ కొరియా దేశాల మధ్య బంధం మరింత పటిష్టం అయ్యేలా ప్రయత్నిస్తానని తెలిపాడు కిమ్.
తాజా వార్తలు
- ఏపీ మోడల్ స్కూల్స్ ల్లో ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లు జాగ్రత్త..
- యూట్యూబర్ అన్వేష్ కు బిగ్ షాక్
- హైదరాబాద్లో అనిరుధ్ కాన్సర్ట్, టికెట్లకు భారీ పోటీ!
- బ్రహ్మోత్సవాలకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు యాదాద్రి ఈఓ ఆహ్వానం
- కింగ్ ఫహద్ కాజ్వే పై టోల్ బాదుడు షురూ..!!
- ట్రాఫిక్ డిపార్టుమెంట్ కు కొత్త వర్కింగ్ అవర్స్..!!
- విద్యాసంస్థలకు మద్దతుగా మెడికల్ ఇక్విప్ మెంట్..!!
- ప్రపంచ వారసత్వ జాబితాలో ఒమన్ సైట్లకు చోటు..!!
- ఖతార్ విమానాల రాకపోకల్లో 6 శాతం వృద్ధి..!!









