హైదరాబాద్ పాతబస్తీలో విషాదం..9 మంది మృతి
- October 14, 2020
హైదరాబాద్:హైదరాబాద్ నగరాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. విపరీతంగా కొడుతున్న వర్షాలకు రోడ్లు, పలు కాలనీలు జలమయమయ్యాయి. మొన్నటి నుంచి హైదరాబాద్ నగరాన్ని వర్షాలు వదలడం లేదు. ఏకంగా 32 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ భారీ వర్షానికి కొన్ని చోట్ల ఇళ్లు కూలిపోయాయి. అయితే ఈ వర్షాల కారణంగా హైదరాబాద్ లో విషాదం నెలకొంది. నగరంలోని పాతబస్తీలోని చాంద్రాయణ గుట్టలో వర్షభీభత్సానికి గౌస్ నగర్ లో రెండు ఇళ్లు కూలిపోయాయి. ఈ ఘటనలో 9 మంది మృతి చెందారు.
ఎత్తైన ప్రదేశంలో ఉన్న ఇళ్లపై బండరాళ్లు జారిపడటంతో ఈ ప్రమాదం జరిగింది. 9 మంది మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ఘటనలో మరో నలుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. నగరంలో మరో రెండు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, కొండకింద ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇళ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- దక్షిణాఫ్రికా చేతిలో ఘోరంగా ఓడిపోయిన భారత్
- వాహనాల పైకప్పుల పై కూర్చోవడం డేంజర్, క్రైమ్..!!
- సోహార్లో చోరీ కేసులో ఇద్దరు అరెస్టు..!!
- దుబాయ్ లో బెగ్గర్ అరెస్ట్.. నగదు చూసి పోలీసులు షాక్..!!
- సౌదీ అరేబియాలో 14,893 మంది బహిష్కరణ..!!
- ట్రాన్సిట్, టూరిజం పాలసీపై సమీక్షకు సన్నాహాలు..!!
- ప్రవాసుల లా సేవల పై కువైట్ బార్ అసోసియేషన్ సీరియస్..!!
- భారతీయ విశ్వవిద్యాలయాలు ‘రోబోడాగ్’ నుంచి ఏం నేర్చుకోవాలి: BITS వైస్ ఛాన్సలర్ రాంగోపాల్ రావు
- ట్రంప్ టారిఫ్ దెబ్బ, దిగుమతుల పై 15% సుంకం ప్రకటింపు
- టీబీజేపీ ప్రెసిడెంట్ రాంచందర్ రావు అరెస్ట్..









