హైదరాబాద్ పాతబస్తీలో విషాదం..9 మంది మృతి
- October 14, 2020
హైదరాబాద్:హైదరాబాద్ నగరాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. విపరీతంగా కొడుతున్న వర్షాలకు రోడ్లు, పలు కాలనీలు జలమయమయ్యాయి. మొన్నటి నుంచి హైదరాబాద్ నగరాన్ని వర్షాలు వదలడం లేదు. ఏకంగా 32 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ భారీ వర్షానికి కొన్ని చోట్ల ఇళ్లు కూలిపోయాయి. అయితే ఈ వర్షాల కారణంగా హైదరాబాద్ లో విషాదం నెలకొంది. నగరంలోని పాతబస్తీలోని చాంద్రాయణ గుట్టలో వర్షభీభత్సానికి గౌస్ నగర్ లో రెండు ఇళ్లు కూలిపోయాయి. ఈ ఘటనలో 9 మంది మృతి చెందారు.
ఎత్తైన ప్రదేశంలో ఉన్న ఇళ్లపై బండరాళ్లు జారిపడటంతో ఈ ప్రమాదం జరిగింది. 9 మంది మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ఘటనలో మరో నలుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. నగరంలో మరో రెండు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, కొండకింద ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇళ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!







