భారత్ లో మళ్ళీ పెరిగిన కరోనా కేసుల నమోదు

- October 15, 2020 , by Maagulf
భారత్ లో మళ్ళీ పెరిగిన కరోనా కేసుల నమోదు

న్యూ ఢిల్లీ:భారత్ లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 73 లక్షల 7 వేలు దాటింది. గడచిన 24 గంటలలో 67,708 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలానే గడచిన 24 గంటలలో దేశంలో కరోనా వల్ల మొత్తం 680 మంది మృతి చెందారు. అలానే గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 71,760గా ఉంది.

దేశంలో ఇప్పటి వరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 73,07,098 కాగా అందులో ఇప్పుడు దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 8,12,390 ఉన్నాయి. ఇప్పటిదాకా కరోనాకు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 63,83,442కి చేరింది. అలానే కరోనా వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 1,11,266కి చేరింది. ఇక దేశంలో నిన్న 11,36,183 కరోనా పరీక్షలు చేయగా ఇప్పటిదాకా 9,12,26,305 పరీక్షలు చేసినట్టు అయింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com