కొత్త పాస్ పోర్టుల్లేవ్..పాతవారికే పాస్ పోర్టుల పునరుద్ధరణ..NRIలకు సూచన
- October 15, 2020
అబుధాబి:ఇండియన్లకు పాస్ పోర్టుల జారీ విషయంలో అబుధాబిలోని భారత రాయబార కార్యాలయం స్పష్టతనిచ్చింది. ఇప్పటికే పాస్ పోర్టు గడువు ముగిసిన వారు, రెసిడెన్సీ గడువు ముగిసినవారు..లేదంటే నవంబర్ 30తో గడువు ముగిసే వారికి మాత్రమే పాస్ పోర్టులను పునరుద్ధరించనున్నట్లు కార్యాలయ అధికారులు చెబుతున్నారు. కేవలం వారి దరఖాస్తులను మాత్రమే పరిశీలించనున్నట్లు తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో భౌతిక దూరం పాటించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే..ఎవరికైన అత్యవసరంగా పాస్ పోర్టు పొందాల్సిన అవసరం ఉంటే..వారు పాస్ పోర్టు దరఖాస్తుకు అవసరమైన అన్ని డాక్యుమెంట్లను స్కాన్ చేసి..ఏ అత్యవసర పని కోసం పాస్ పోర్టు కోరుతున్నారో వివరిస్తూ లేఖను జతపరిచి [email protected].కి మెయిల్ చేయాలని రాయబార కార్యాలయం తెలపింది. మెయిల్ కు వచ్చే ప్రతి దరఖాస్తును తాము విధిగా పరిశీలిస్తామని, అవసరం ఉందనుకుంటే వారికి ఎంబసీ తరపున తగిన సహాయ సహాకారాలు అందిస్తామని వెల్లడించింది. పాస్ పోర్టు దరఖాస్తు సూచనలను ఇండియన్లు గమనించి అధికారులకు సహకరించాలని కార్యాలయ అధికారులు కోరారు.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!