కొత్త పాస్ పోర్టుల్లేవ్..పాతవారికే పాస్ పోర్టుల పునరుద్ధరణ..NRIలకు సూచన
- October 15, 2020
అబుధాబి:ఇండియన్లకు పాస్ పోర్టుల జారీ విషయంలో అబుధాబిలోని భారత రాయబార కార్యాలయం స్పష్టతనిచ్చింది. ఇప్పటికే పాస్ పోర్టు గడువు ముగిసిన వారు, రెసిడెన్సీ గడువు ముగిసినవారు..లేదంటే నవంబర్ 30తో గడువు ముగిసే వారికి మాత్రమే పాస్ పోర్టులను పునరుద్ధరించనున్నట్లు కార్యాలయ అధికారులు చెబుతున్నారు. కేవలం వారి దరఖాస్తులను మాత్రమే పరిశీలించనున్నట్లు తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో భౌతిక దూరం పాటించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే..ఎవరికైన అత్యవసరంగా పాస్ పోర్టు పొందాల్సిన అవసరం ఉంటే..వారు పాస్ పోర్టు దరఖాస్తుకు అవసరమైన అన్ని డాక్యుమెంట్లను స్కాన్ చేసి..ఏ అత్యవసర పని కోసం పాస్ పోర్టు కోరుతున్నారో వివరిస్తూ లేఖను జతపరిచి [email protected].కి మెయిల్ చేయాలని రాయబార కార్యాలయం తెలపింది. మెయిల్ కు వచ్చే ప్రతి దరఖాస్తును తాము విధిగా పరిశీలిస్తామని, అవసరం ఉందనుకుంటే వారికి ఎంబసీ తరపున తగిన సహాయ సహాకారాలు అందిస్తామని వెల్లడించింది. పాస్ పోర్టు దరఖాస్తు సూచనలను ఇండియన్లు గమనించి అధికారులకు సహకరించాలని కార్యాలయ అధికారులు కోరారు.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!
- సౌత్ అల్ బతినా సమ్మర్ ఫోరమ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- 1 ట్రిలియన్ దిర్హమ్లను దాటిన దుబాయ్ బ్రాండ్ వాల్యూ..!!
- సముద్రంలో ఇద్దరిని రక్షించిన బోర్డర్ గార్డ్స్..!!
- రిటర్న్ టికెట్లతో దుబాయ్లో ఉచిత హోటల్ బస..ఎమిరేట్స్ ప్రత్యేక సమ్మర్ ఆఫర్
- NEET పునఃపరీక్షలో మొత్తం 30 మంది అరెస్టు







