కొత్త పాస్ పోర్టుల్లేవ్..పాతవారికే పాస్ పోర్టుల పునరుద్ధరణ..NRIలకు సూచన
- October 15, 2020
అబుధాబి:ఇండియన్లకు పాస్ పోర్టుల జారీ విషయంలో అబుధాబిలోని భారత రాయబార కార్యాలయం స్పష్టతనిచ్చింది. ఇప్పటికే పాస్ పోర్టు గడువు ముగిసిన వారు, రెసిడెన్సీ గడువు ముగిసినవారు..లేదంటే నవంబర్ 30తో గడువు ముగిసే వారికి మాత్రమే పాస్ పోర్టులను పునరుద్ధరించనున్నట్లు కార్యాలయ అధికారులు చెబుతున్నారు. కేవలం వారి దరఖాస్తులను మాత్రమే పరిశీలించనున్నట్లు తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో భౌతిక దూరం పాటించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే..ఎవరికైన అత్యవసరంగా పాస్ పోర్టు పొందాల్సిన అవసరం ఉంటే..వారు పాస్ పోర్టు దరఖాస్తుకు అవసరమైన అన్ని డాక్యుమెంట్లను స్కాన్ చేసి..ఏ అత్యవసర పని కోసం పాస్ పోర్టు కోరుతున్నారో వివరిస్తూ లేఖను జతపరిచి [email protected].కి మెయిల్ చేయాలని రాయబార కార్యాలయం తెలపింది. మెయిల్ కు వచ్చే ప్రతి దరఖాస్తును తాము విధిగా పరిశీలిస్తామని, అవసరం ఉందనుకుంటే వారికి ఎంబసీ తరపున తగిన సహాయ సహాకారాలు అందిస్తామని వెల్లడించింది. పాస్ పోర్టు దరఖాస్తు సూచనలను ఇండియన్లు గమనించి అధికారులకు సహకరించాలని కార్యాలయ అధికారులు కోరారు.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







