కోవిడ్ 19 ర్యాపిడ్ టెస్టులను ప్రారంభించిన బహ్రెయిన్
- October 16, 2020
మనామా:కోవిడ్ 19 సోకిన వారిని గుర్తించేందుకు ర్యాపిడ్ టెస్టులను ప్రారంభించినట్లు బహ్రెయిన్ ఆరోగ్య శాఖ ప్రకటించింది. సుల్తానేట్ పరిధిలో ట్రయల్ బేస్ గా దాదాపు 20 వేల మందికి ర్యాపిడ్ టెస్టులు నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ప్రధానంగా టీచర్లు, విద్యార్ధులు, వైద్య సిబ్బంది, కోవిడ్ లక్షణాలు ఉన్న వ్యక్తులకు, ప్రధామిక వైద్య కేంద్రాల్లోని ల్యాబ్ టెక్నిషియన్లకు కోవిడ్ ర్యాపిడ్ టెస్టులను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ముక్కులో నుంచి నమూనాలను సేకరించి కేవలం 15 ననిమిషాల్లోనే ఫలితాలను రాబొట్టచ్చని, అదీ కూడా ఎలాంటి ప్రత్యేకమైన ల్యాబ్ కూడా అవసరం లేకుండా పరీక్షలు చేయవచ్చని అధికారులు వెల్లడించారు. అయితే..ర్యాపిడ్ టెస్ట్ ఫలితాలు పూర్తిగా పీసీఆర్ టెస్ట్ కు ప్రత్యామ్నాయం మాత్రం కాదని అభిప్రాయపడ్డారు. కానీ, ర్యాపిడ్ టెస్టు ద్వారా చాలా సమయం ఆదా అవటంతో పాటు ఎక్కువ మందికి పరీక్షలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- NEET పరీక్ష సమయంలో టెలిగ్రామ్ నిషేధం..రాహుల్ గాంధీ ఆగ్రహం
- హైదరాబాద్లో టెస్లా ఎక్స్పీరియన్స్ సెంటర్
- ఇరాన్ విషయంలో మరో బాంబ్ పేల్చిన ట్రంప్
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన అధికారులు
- జెనీవా కార్యక్రమానికి ఖతార్ ప్రాతినిధ్యం..!!
- పవిత్ర కాబాకు కొత్త 'కిస్వా'తో అలంకరణ పూర్తి..!!
- ఫుజైరాలోని 'మ్యూజికల్ స్ట్రీట్'కు అరుదైన ఘనత..!!
- హోర్ముజ్లో సంబంధాలు, సముద్ర భద్రతకు కృషి..!!
- ఎనిమిది వేర్వేరు డ్రగ్ కేసుల్లో 14 మంది అరెస్టు..!!
- ఎన్నారైల కోసం ఇండియా కొత్త ఇన్వెస్ట్ మెంట్ రూల్స్..!!









