వీసా గడువు ముగిసిన ప్రవాసీయులకు అనుమతి లేదని ఒమన్ ప్రకటన
- October 16, 2020
మస్కట్:విదేశాల్లో ఉన్న ఒమన్ వీసాదారులకు సంబంధించి కీలక ప్రకటన చేసింది ఒమన్ ప్రభుత్వం. వీసా గడువు ముగిసిన ప్రవాస కార్మికులను ఒమన్ లోకి అనుమతించబోమని స్పష్టం చేసింది. కోవిడ్ 19 నియంత్రణకు ఏర్పాటైన సుప్రీం కమిటీ ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో బ్రిగేడియన్ అల్ అస్మి ఈ మేరకు ప్రకటన చేశారు. ప్రస్తుతం ఒమన్ ప్రభుత్వం కొత్త వీసాల జారీని నిలిపివేసిందని, విదేశాల్లో ఉంటూ వీసా గడువు ముగిసిన వారు ఒమన్ రావొద్దంటూ ఆయన సూచించారు. కేవలం గడువు ముగియని రెసిడెన్సీ వీసాదారులు, వారి కుటుంబాలకు మాత్రమే ప్రస్తుతం అనుమతి ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. మరోవైపు కోవిడ్ 19 నియంత్రణకు నిబద్ధతతో సహకరించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారాయన. అయితే..కొన్ని చోట్ల మాత్రం సుప్రీం కమిటీ సూచించిన మార్గనిర్దేశకాలకు విరుద్ధంగా
వ్యవహరించిన ఘటనలు చోటు చేసుకున్నాయని బ్రిగేడియర్ అన్నారు. జనసంచారంపై నిషేధం ఉన్న సమయంలో బయట తిరిగిన వారిని, ఫేస్ మాస్కులు ధరించని వారిని గుర్తించామని...పబ్లిక్ ప్రాసిక్యూషన్ కంటే ముందే వారిని పిలిచి జరిమానాలు విధిస్తామన్నారు. అలాగే పబ్లిక్ ప్రాసిక్యూషన్ ముగిసిన తర్వాత వారి ఫోటోలు, పేర్లు పేపర్లు వేయిస్తామని వెల్లడించారు. ఇదిలాఉంటే..ఇప్పటివరకు ఒమన్ లో 3,919 మంది వైద్య సిబ్బంది కోవిడ్ 19 బారిన పడినట్లు వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







