భారత్ లో 74 లక్షలు దాటిన కరోనా కేసులు

- October 17, 2020 , by Maagulf
భారత్ లో 74 లక్షలు దాటిన కరోనా కేసులు

న్యూ ఢిల్లీ:భారతదేశంలో గత 24 గంటల్లో 62,212 మందికి కరోనా నిర్ధారణ అయిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 74,32,681 (74 లక్షలు దాటింది) కి చేరింది. దేశంలో నిన్నటి వరకు మొత్తం 9,32,54,017 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసిఎంఆర్‌) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 9,99,090 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

గత 24 గంటల్లో 837 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,12,998 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 65,24,596 మంది కోలుకున్నారు. 7,95,087 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com