నిరాడంబరంగా మైసూరు దసరా ఉత్సవాలు ప్రారంభం
- October 17, 2020మైసూరు:మైసూరు దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యేవి.. కానీ కరోనా వైరస్ రాకతో ఆ వేడుకలు నిరాడంబరంగానే మొదలయ్యాయి.. దసరా వేడుకలనగానే అప్రయత్నంగానే గుర్తుకొచ్చేది మైసూరు.. పది రోజుల పాటు అక్కడ వైభవంగా జరుగుతాయి.. కర్నాటక సంస్కృతీ సంప్రదాయలకు చిహ్నంగా నిలుస్తాయి.. ముఖ్యమంత్రి యడియూరప్ప మైసూరు రాజకుటుంబీకులతో కలిసి చాముండేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవాలను ప్రారంభించారు. ఈసారి ఆ వేడుకలను ప్రత్యక్షంగా చూసే అదృష్టం ప్రజలకు లేదు.. ఉత్సవాలను లైవ్ టెలికాస్టులో చూడవచ్చు.. నవరాత్రులలో రాజప్రసాదం, చాముండేశ్వరి ఆలయం కొత్త కాంతులను అద్దుకుంటాయి.. విద్యుత్దీపాల వెలుగులో మెరిసిపోతుంటాయి.. మైసూరులో దసరా ఉత్సవాలను నిర్వహించడమన్నది 15వ శతాబ్దంలోనే మొదలయ్యింది.. విజయనగర పాలకులు కూడా దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.. విజయనగర సామ్రాజ్యం పతనం అయ్యాక మైసూరు రాజులైన ఒడయార్లు ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు.
తాజా వార్తలు
- ఎయిరిండియా ఎక్స్ప్రెస్ అదిరే ఆఫర్..
- కవిత అరెస్ట్ పై తొలిసారి స్పందించిన కేసీఆర్..
- ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా
- భారత్ మరియు దక్షిణాసియాలో హైదరాబాద్ విమానాశ్రేయనిదే అగ్రస్థానం
- తుఫాను ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేయడం చట్టవిరుధ్ధం..యూఏఈ
- పౌరులు, నివాసితుల భద్రతే ముఖ్యం..యూఏఈ అధ్యక్షుడు
- సౌదీల్లో 50% ట్రాఫిక్ తగ్గింపు ఆఫర్ అమలు
- వరద నీటిలో తెలియాడుతున్న వందలాది కార్లు..!
- ఇండియన్ ఇంజనీర్స్ సమస్యపై కీలక చర్చ
- ఒడిశాలోని జాజ్పూర్ కలెక్టర్గా తెలుగు వ్యక్తి నిఖిల్ పవన్ కళ్యాణ్