క్వారంటైన్ గడువు సమయంలోనూ దేశం విడిచి వెళ్లేందుకు కువైట్ అనుమతి
- October 18, 2020కువైట్ సిటీ:కువైట్ చేరుకునే ప్రయాణికులు, ప్రవాసీయులకు సంబంధించి క్వారంటైన్ నిబంధనల్లో స్వల్ప సవరణలు చేసింది కువైట్ ప్రభుత్వం. కువైట్ ఆరోగ్య శాఖ జారీ చేసిన మార్గనిర్దేశకాల మేరకు సుల్తానేట్ కు చేరుకునే ప్రయాణికులు 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాల్సి ఉంది. అయితే..సదరు ప్రయాణికుడు తాను తిరిగి తన దేశం వెళ్లాలని అనుకుంటే..వారు క్వారంటైన్ గడువు సమయంలోనూ నిరభ్యంతరంగా దేశం విడిచి వెళ్లొచ్చని తెలిపింది. దేశం విడిచి వెళ్లే ప్రయాణికుల విషయంలో ఎయిర్ పోర్టు అధికారులు ఎలాంటి అభ్యంతరాలు చెప్పొద్దని కూడా సూచించింది. అయితే..కోవిడ్ లక్షణాలు ఉంటే మాత్రం ప్రయాణానికి అనుమతించరు. ఇదిలాఉంటే..కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉన్న 34 దేశాల నుంచి విమాన ప్రయాణాలపై విధించిన నిషేధం యధావిధిగా కొనసాగుతుంది.
--దివాకర్(మాగాల్ఫా ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!