PHD పట్టా అందుకున్న తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి
- October 18, 2020హైదరాబాద్:తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి PHD పూర్తి అయ్యింది. ఈ నేపథ్యంలో శుక్రవారం జేఎన్టీయూ స్నాతకోత్సవంలో ఆయన తన PHD పట్టాను అందుకున్నారు. వర్సిటీ వీసీ ఇన్ఛార్జి జయేష్ రంజన్ మహేందర్ రెడ్డికి పీహెచ్డీ పట్టాను అందజేశారు.
ఈ సందర్భంగా డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఇంపాక్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆన్ పోలీసింగ్ పురస్కారం అందుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. పోలీసింగ్, సమాజ భద్రతలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వినియోగంపై పదేళ్లుగా తాను అధ్యయనం చేసినట్లు తెలిపారు. తాను PHD పూర్తి చేయడంలో సహకరించిన గైడ్, ఇతర సభ్యులకు కృతజ్ఞతలు చెప్పారు. తన పరిశోధన తెలంగాణ పోలీసులకు ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..