రోజారమణి, చక్రపాణికి ఆదర్శ దంపతుల జీవిత సాఫల్య పురస్కారం - 2020
- October 18, 2020
అమెరికా:అమెరికా గానకోకిల శారద ఆకునూరి నిర్వహణలో వంశీ ఇంటర్నేషనల్ ఇండియా మరియు యునైటెడ్ కింగ్డమ్ తెలుగు అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో వర్చువల్ పద్దతిలో శనివారం(అక్టోబర్ 17) జరిగిన కార్యక్రమంలో స్వర్ణోత్సవ నటీమణి రోజారమణి, చక్రపాణి దంపతులకు ఆదర్శ దంపతుల జీవిత సాఫల్య పురస్కారం బహూకరించారు. వారి స్వగృహంలో తనయుడు ప్రముఖ నటుడు తరుణ్, తనయ అమూల్య తల్లిదండ్రులకు శాలువా, పుష్పగుచ్చంతో జీవిత సాఫల్య పురస్కారంతో సత్కారించారు.
ఈ సందర్భంగా హీరో తరుణ్ మాట్లాడుతూ బాల్యంలో తన తల్లి భక్త ప్రహ్లాదలో నటించి జాతీయ పురస్కారం అందుకోవడం అదే విధంగా తను కూడా అంజలి చిత్రంలో బాలనటుడిగా జాతీయ పురస్కారం అందుకోవడం జీవితంలో ఒక మధుర స్మృతి అన్నారు. వంశీ సంస్థల వ్యవస్థాపకులు శిరోమణి వంశీ రామరాజు స్వాగతం పలికిన ఈ సభలో యునైటెడ్ కింగ్డమ్ తెలుగు సమాఖ్య ట్రస్టీ డా.వీపీ కిల్లి పరిచయ వ్యాఖ్యాలు పలికారు.
సభలో పాల్గొన్న పార్లమెంట్ మాజీ సభ్యులు సినీ నటులు నిర్మాత మాగంటి మురళీమోహన్ మాట్లాడుతూ రోజారమణితో తను వస్తాడే మా బావ, భారతంలో ఒక అమ్మాయిలో నటించానని గుర్తు చేశారు. ఆమె నటన వైదుష్యాన్ని ప్రశింసించారు. ఆమెను డబ్బింగ్ కళాకారిణిగా మొట్టమొదట తానే పరిచయం చేశానని తెలిపారు. 400 చిత్రాలకు పైగా సుహాసిని, రాధా, మీనా, విజయశాంతి వంటి హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పారని తెలియజేశారు. అంతేగాక చక్రపాణి ఒరియాలో మనకు ఎన్టీఆర్ లాగా పౌరాణిక పాత్రల్లో నటించి ప్రశంసలందుకున్నారని అన్నారు.
రోజారమణి మాట్లాడుతూ తమ జీవితమంతా కళలకు అంకితమైందని, కళల మయమైన జీవితం ఆనందాన్ని చేకూరుస్తుందని అన్నారు. చివరగా జరిగిన సంగీత కార్యక్రమంలో రాధిక నోరి(అమెరికా), రాజేంద్రప్రసాద్(వైజాగ్) తమ గానాన్ని వినిపించారు. ఈ కార్యక్రమంలో సినీ దర్శకులు రేలంగా నరసింహారావు, తానా అధ్యక్షుడు జయశేఖర్ తాళ్లూరి, డా. ప్రసాద్ తోటకూర, జయశ్రీ పీసపాటి(హాంగ్ కాంగ్), విజయ గొల్లపూడి(ఆస్ట్రేలియా) ప్రసంగించారు. డా. తెన్నేటి సుధా, శైలజ సుంకరపల్లి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. కార్యక్రమం ఆద్యంతం గాయని శారద ఆకునూరి తన పాటలతో మాటలతో చక్కటి వ్యాఖ్యానంతో అలరించారు.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!