కోవిడ్-19: 7 నెలల తర్వాత పవిత్ర మక్కాలో ప్రార్ధనలకు సౌదీ అరేబియా అనుమతి
- October 18, 2020రియాద్ :పవిత్ర మక్కాలో భక్తులు ప్రార్ధనలు నిర్వహించుకునేందుకు ఎట్టకేలకు సౌదీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే..దేశంలో ఉన్న పౌరులు, ప్రవాసీయులకు మాత్రమే ప్రార్ధనలకు అనుమతించనున్నట్లు స్పష్టం చేసింది. కరోనా వైరస్ ప్రబలిన నాటి నుంచి సామూహిక ప్రార్ధనలను నిషేధించటంతో మక్కా, మదీనాలోనూ భక్తులను అనుమతించలేదు. అన్ లాక్ ప్రక్రియలో భాగంగా విడతల వారీగా ఆంక్షలను సడలిస్తూ వస్తున్న సౌదీ ప్రభుత్వం 7 నెలల తర్వాత మళ్లీ ఇప్పుడు మసీదులోకి భక్తులను అనుమతించేందుకు ఆమోదం తెలిపింది. అయితే..కోవిడ్ 19 నేపథ్యంలో ఆరోగ్య భద్రత నిబంధనలను పాటించాలని కూడా ప్రభుత్వం సూచించింది. ఇదిలాఉంటే ఈ నెల ప్రారంభంలోనే పౌరులు, ప్రవాసీయులకు మక్కా, మదీనాలో ఉమ్రా ప్రార్ధనలకు అనుమతించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- మే నెలలో పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
- విద్యార్థులపై లైంగిక వేధింపులు.. టీచర్కు 15 ఏళ్ల జైలుశిక్ష
- మనీలాండరింగ్..పౌరులు, ప్రవాసుడు అరెస్ట్
- నాలెడ్జ్ ఒమన్ అకాడమీ ప్రారంభం
- వేసవి కొత్త సీజన్ ప్రారంభం.. 40°Cకు ఉష్ణోగ్రతలు
- భారీ వర్షాలు.. నివాసితుల ముందస్తు జాగ్రత్తలు..!
- పారిశ్రామిక చట్టాల ఉల్లంఘన..11సంస్థలు మూసివేత
- తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..
- తెలంగాణ: వడదెబ్బకు ఐదుగురు మృతి.. ఇవాళ, రేపు జాగ్రత్త
- తెలంగాణలో ప్రధాని మోదీ భారీ బహిరంగ సభ.. ఏర్పాట్లు పూర్తి