కోవిడ్-19: 7 నెలల తర్వాత పవిత్ర మక్కాలో ప్రార్ధనలకు సౌదీ అరేబియా అనుమతి

- October 18, 2020 , by Maagulf
కోవిడ్-19: 7 నెలల తర్వాత పవిత్ర మక్కాలో ప్రార్ధనలకు సౌదీ అరేబియా అనుమతి

రియాద్ :పవిత్ర మక్కాలో భక్తులు ప్రార్ధనలు నిర్వహించుకునేందుకు ఎట్టకేలకు సౌదీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే..దేశంలో ఉన్న పౌరులు, ప్రవాసీయులకు మాత్రమే ప్రార్ధనలకు అనుమతించనున్నట్లు స్పష్టం చేసింది. కరోనా వైరస్ ప్రబలిన నాటి నుంచి సామూహిక ప్రార్ధనలను నిషేధించటంతో మక్కా, మదీనాలోనూ భక్తులను అనుమతించలేదు. అన్ లాక్ ప్రక్రియలో భాగంగా విడతల వారీగా ఆంక్షలను సడలిస్తూ వస్తున్న సౌదీ ప్రభుత్వం 7 నెలల తర్వాత మళ్లీ ఇప్పుడు మసీదులోకి భక్తులను అనుమతించేందుకు ఆమోదం తెలిపింది. అయితే..కోవిడ్ 19 నేపథ్యంలో ఆరోగ్య భద్రత నిబంధనలను పాటించాలని కూడా ప్రభుత్వం సూచించింది. ఇదిలాఉంటే ఈ నెల ప్రారంభంలోనే పౌరులు, ప్రవాసీయులకు మక్కా, మదీనాలో ఉమ్రా ప్రార్ధనలకు అనుమతించిన విషయం తెలిసిందే. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com