కోవిడ్-19: 7 నెలల తర్వాత పవిత్ర మక్కాలో ప్రార్ధనలకు సౌదీ అరేబియా అనుమతి
- October 18, 2020
రియాద్ :పవిత్ర మక్కాలో భక్తులు ప్రార్ధనలు నిర్వహించుకునేందుకు ఎట్టకేలకు సౌదీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే..దేశంలో ఉన్న పౌరులు, ప్రవాసీయులకు మాత్రమే ప్రార్ధనలకు అనుమతించనున్నట్లు స్పష్టం చేసింది. కరోనా వైరస్ ప్రబలిన నాటి నుంచి సామూహిక ప్రార్ధనలను నిషేధించటంతో మక్కా, మదీనాలోనూ భక్తులను అనుమతించలేదు. అన్ లాక్ ప్రక్రియలో భాగంగా విడతల వారీగా ఆంక్షలను సడలిస్తూ వస్తున్న సౌదీ ప్రభుత్వం 7 నెలల తర్వాత మళ్లీ ఇప్పుడు మసీదులోకి భక్తులను అనుమతించేందుకు ఆమోదం తెలిపింది. అయితే..కోవిడ్ 19 నేపథ్యంలో ఆరోగ్య భద్రత నిబంధనలను పాటించాలని కూడా ప్రభుత్వం సూచించింది. ఇదిలాఉంటే ఈ నెల ప్రారంభంలోనే పౌరులు, ప్రవాసీయులకు మక్కా, మదీనాలో ఉమ్రా ప్రార్ధనలకు అనుమతించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- IPL2026: ఢిల్లీ క్యాపిటల్స్ పై కోల్కతా నైట్ రైడర్స్ ఘనవిజయం
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ప్రారంభించిన అపోలో హాస్పిటల్స్
- యూఏఈలో ప్రత్యక్ష లేదా దూర విద్య పై మే 10న నిర్ణయం
- విదేశీ చదువులకు పావలా వడ్డీ రుణాలు..సీఎం కీలక నిర్ణయం
- పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా మళ్లీ రంగస్వామి
- ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- యూఏఈ: రెండు బాలిస్టిక్ క్షిపణులు, మూడు డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థ
- ‘విజయ్ అను నేను‘ అంటూ రేపు విజయ్ సీఎం గా ప్రమాణ స్వీకారం
- పని మనుషులతో జాగ్రత్త: సీపీ సజ్జనార్
- యువతి ప్రాణాలను కాపాడిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు









