కోవిడ్-19: 7 నెలల తర్వాత పవిత్ర మక్కాలో ప్రార్ధనలకు సౌదీ అరేబియా అనుమతి
- October 18, 2020
రియాద్ :పవిత్ర మక్కాలో భక్తులు ప్రార్ధనలు నిర్వహించుకునేందుకు ఎట్టకేలకు సౌదీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే..దేశంలో ఉన్న పౌరులు, ప్రవాసీయులకు మాత్రమే ప్రార్ధనలకు అనుమతించనున్నట్లు స్పష్టం చేసింది. కరోనా వైరస్ ప్రబలిన నాటి నుంచి సామూహిక ప్రార్ధనలను నిషేధించటంతో మక్కా, మదీనాలోనూ భక్తులను అనుమతించలేదు. అన్ లాక్ ప్రక్రియలో భాగంగా విడతల వారీగా ఆంక్షలను సడలిస్తూ వస్తున్న సౌదీ ప్రభుత్వం 7 నెలల తర్వాత మళ్లీ ఇప్పుడు మసీదులోకి భక్తులను అనుమతించేందుకు ఆమోదం తెలిపింది. అయితే..కోవిడ్ 19 నేపథ్యంలో ఆరోగ్య భద్రత నిబంధనలను పాటించాలని కూడా ప్రభుత్వం సూచించింది. ఇదిలాఉంటే ఈ నెల ప్రారంభంలోనే పౌరులు, ప్రవాసీయులకు మక్కా, మదీనాలో ఉమ్రా ప్రార్ధనలకు అనుమతించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!







