యూఏఈ, ఇజ్రాయెల్ మధ్య త్వరలోనే విమానాల రాకపోకలు..శాంతి ఒప్పందంలో కీలక అడుగు

- October 19, 2020 , by Maagulf
యూఏఈ, ఇజ్రాయెల్ మధ్య త్వరలోనే విమానాల రాకపోకలు..శాంతి ఒప్పందంలో కీలక అడుగు

యూఏఈ:దౌత్య సంబంధాలను పునరుద్ధరించేలా ఇటీవలె చారిత్రాత్మక శాంతి ఒప్పందం చేసుకున్న యూఏఈ, ఇజ్రాయెల్..శాంతి ఒప్పందానికి అనుగుణంగా మరో కీలక అడుగు వేయబోతున్నాయి. రెండు దేశాల మధ్య విమానాల రాకపోకలకు అనుమతి ఇస్తూ ద్వైపాక్షిక ఒప్పందం చేసుకోబోతున్నాయి. రెండు దేశాల ప్రతినిధులు ఈ మేరకు రేపు సంతకం చేయనున్నట్లు ఇజ్రాయెల్ రవాణా శాఖ మంత్రి స్పష్టం చేశారు. వారానికి ఒకటి చొప్పున 28 వారాల పాటు ఇజ్రాయెల్ బెన్ గురియన్ విమానాశ్రయం నుంచి దుబాయ్, అబుధాబికి విమానాల సర్వీసులను నడిపేలా ఒప్పందం చేసుకుంటారు. ఇక చార్టెర్డ్ విమానాలను అపరిమితంగా నడుపుకోవచ్చు. వారానికి ఒకటి చొప్పున పది వారాల పాటు కార్గో ఫ్లైట్స్ ను కూడా అపరేట్ చేయనున్నారు. రేపు ఒప్పంద పత్రాలపై సంతకం చేసిన తర్వాత కొన్ని వారాల్లోనే విమానాల రాకపోకలు ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయని ఇజ్రాయెల్ తెలిపింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com