వందే భారత్ మిషన్:డిసెంబర్ 31 వరకు యూఏఈ నుంచి భారత్ కు టికెట్ల బుకింగ్
- October 18, 2020
యూఏఈ:యూఏఈలో చిక్కుకుపోయిన వారిని భారత్ తీసుకొచ్చేందుకు ప్రత్యేక విమాన సర్వీసులు నడుపుతున్న ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్...వందే భారత్ మిషన్ సర్వీసును డిసెంబర్ 31 వరకు పొడిగించినట్లు ప్రకటించింది. ఏడో విడతలో భాగంగా డిసెంబర్ 31 వరకు భారత్ తిరిగి వచ్చేందుకు వీలుగా బుకింగ్స్ ను కూడా ప్రారంభించినట్లు తెలిపింది. నిజానికి యూఏఈ-భారత్ మధ్య కుదిరిన బబుల్ ఫ్లైట్స్ ఒప్పందం అక్టోబర్ 25తో ముగుస్తుంది. కానీ, గల్ఫ్ లోని కొన్ని దేశాలకు భారత్ నుంచి ప్రయాణాలపై ఇంకా ఆంక్షలు కొనసాగుతున్న విషయం తెలసిందే. దీంతో ఆయా దేశాల్లో ఉంటున్న భారతీయులు యూఏఈ మీదుగా ఇండియా వచ్చేందుకు సిద్ధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే యూఏఈ నుంచి భారత్ కు బబుల్ ఫ్లైట్స్ సర్వీసులను డిసెంబర్ 31 వరకు పొడిగిస్తూ..బుకింగ్స్ ను ప్రారంభించింది ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్. యూఏఈ నుంచి భారత్ చేరుకోవాలనుకునే వారు ఎయిర్ ఇండియా అధికారిక వెబ్ సైట్(https://www.airindiaexpress.in/en/book-flight) నుంచి టికెట్లను బుక్ చేసుకోవచ్చు. లేదంటే ఎయిరిండియా కాల్ సెంటర్, అధికారిక ట్రావెల్ ఏజెంట్ల ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- పని మనుషులతో జాగ్రత్త: సీపీ సజ్జనార్
- యువతి ప్రాణాలను కాపాడిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు
- ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానంగా ఖతార్..!!
- రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి: కేటీఆర్
- దుబాయ్ ఇ-స్కూటర్ రూల్స్: జోన్లు, జరిమానాల పై ఆర్టీఏ క్లారిటీ..!!
- అంతర్జాతీయ ఫోటోగ్రఫీ పోటీలో మెరిసిన ఒమన్..!!
- హోర్ముజ్ జలసంధి దిగ్బంధనం..ప్రపంచ వాణిజ్యానికి ముప్పు..!!
- కువైట్ లో ప్రజా రవాణా వ్యవస్థ ఆధునీకీకరణ..!!
- మక్కా, మదీనాలో 23వేలకు పైగా తనిఖీలు..!!
- చూపు లేకుండా శిశువు జననం..తల్లికి రూ.కోటి పరిహారం









