వందే భారత్ మిషన్:డిసెంబర్ 31 వరకు యూఏఈ నుంచి భారత్ కు టికెట్ల బుకింగ్
- October 18, 2020
యూఏఈ:యూఏఈలో చిక్కుకుపోయిన వారిని భారత్ తీసుకొచ్చేందుకు ప్రత్యేక విమాన సర్వీసులు నడుపుతున్న ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్...వందే భారత్ మిషన్ సర్వీసును డిసెంబర్ 31 వరకు పొడిగించినట్లు ప్రకటించింది. ఏడో విడతలో భాగంగా డిసెంబర్ 31 వరకు భారత్ తిరిగి వచ్చేందుకు వీలుగా బుకింగ్స్ ను కూడా ప్రారంభించినట్లు తెలిపింది. నిజానికి యూఏఈ-భారత్ మధ్య కుదిరిన బబుల్ ఫ్లైట్స్ ఒప్పందం అక్టోబర్ 25తో ముగుస్తుంది. కానీ, గల్ఫ్ లోని కొన్ని దేశాలకు భారత్ నుంచి ప్రయాణాలపై ఇంకా ఆంక్షలు కొనసాగుతున్న విషయం తెలసిందే. దీంతో ఆయా దేశాల్లో ఉంటున్న భారతీయులు యూఏఈ మీదుగా ఇండియా వచ్చేందుకు సిద్ధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే యూఏఈ నుంచి భారత్ కు బబుల్ ఫ్లైట్స్ సర్వీసులను డిసెంబర్ 31 వరకు పొడిగిస్తూ..బుకింగ్స్ ను ప్రారంభించింది ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్. యూఏఈ నుంచి భారత్ చేరుకోవాలనుకునే వారు ఎయిర్ ఇండియా అధికారిక వెబ్ సైట్(https://www.airindiaexpress.in/en/book-flight) నుంచి టికెట్లను బుక్ చేసుకోవచ్చు. లేదంటే ఎయిరిండియా కాల్ సెంటర్, అధికారిక ట్రావెల్ ఏజెంట్ల ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ







