యూఏఈ, ఇజ్రాయెల్ మధ్య త్వరలోనే విమానాల రాకపోకలు..శాంతి ఒప్పందంలో కీలక అడుగు
- October 19, 2020
యూఏఈ:దౌత్య సంబంధాలను పునరుద్ధరించేలా ఇటీవలె చారిత్రాత్మక శాంతి ఒప్పందం చేసుకున్న యూఏఈ, ఇజ్రాయెల్..శాంతి ఒప్పందానికి అనుగుణంగా మరో కీలక అడుగు వేయబోతున్నాయి. రెండు దేశాల మధ్య విమానాల రాకపోకలకు అనుమతి ఇస్తూ ద్వైపాక్షిక ఒప్పందం చేసుకోబోతున్నాయి. రెండు దేశాల ప్రతినిధులు ఈ మేరకు రేపు సంతకం చేయనున్నట్లు ఇజ్రాయెల్ రవాణా శాఖ మంత్రి స్పష్టం చేశారు. వారానికి ఒకటి చొప్పున 28 వారాల పాటు ఇజ్రాయెల్ బెన్ గురియన్ విమానాశ్రయం నుంచి దుబాయ్, అబుధాబికి విమానాల సర్వీసులను నడిపేలా ఒప్పందం చేసుకుంటారు. ఇక చార్టెర్డ్ విమానాలను అపరిమితంగా నడుపుకోవచ్చు. వారానికి ఒకటి చొప్పున పది వారాల పాటు కార్గో ఫ్లైట్స్ ను కూడా అపరేట్ చేయనున్నారు. రేపు ఒప్పంద పత్రాలపై సంతకం చేసిన తర్వాత కొన్ని వారాల్లోనే విమానాల రాకపోకలు ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయని ఇజ్రాయెల్ తెలిపింది.
తాజా వార్తలు
- పని మనుషులతో జాగ్రత్త: సీపీ సజ్జనార్
- యువతి ప్రాణాలను కాపాడిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు
- ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానంగా ఖతార్..!!
- రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి: కేటీఆర్
- దుబాయ్ ఇ-స్కూటర్ రూల్స్: జోన్లు, జరిమానాల పై ఆర్టీఏ క్లారిటీ..!!
- అంతర్జాతీయ ఫోటోగ్రఫీ పోటీలో మెరిసిన ఒమన్..!!
- హోర్ముజ్ జలసంధి దిగ్బంధనం..ప్రపంచ వాణిజ్యానికి ముప్పు..!!
- కువైట్ లో ప్రజా రవాణా వ్యవస్థ ఆధునీకీకరణ..!!
- మక్కా, మదీనాలో 23వేలకు పైగా తనిఖీలు..!!
- చూపు లేకుండా శిశువు జననం..తల్లికి రూ.కోటి పరిహారం









