బహ్రెయిన్:ఏటీఎం కార్డులను చోరీ చేసి డబ్బు దోచుకున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్

- October 19, 2020 , by Maagulf
బహ్రెయిన్:ఏటీఎం కార్డులను చోరీ చేసి డబ్బు దోచుకున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్

మనామా:ఏటీఎం కార్డులను చోరీ చేసి ఆర్ధిక నేరాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను బహ్రెయిన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు ముగ్గురు తాము దొంగిలించిన ఏటీఎం కార్డుల విదేశాల్లో ఉన్న నాలుగో నిందితుడికి చేరవేసి..అతని ద్వారా అక్రమంగా డబ్బు బదిలీ చేసుకున్నారు. అయితే..బాధిత కంపెనీల్లో ఒక కంపెనీ కార్డుల ద్వారా అనుమానస్పద లావాదేవీలను గుర్తించి పోలీసులను ఆశ్రయించింది. ఎలక్ట్రానిక్ కార్డుల ద్వారా కింగ్డమ్ వెలుపల లావాదేవీలు జరిగాయని, దీనిపై తమకు సందేహాలు ఉన్నాయని తమ ఫిర్యాదులో పేర్కొంది. దీంతో విచారణ చేపట్టిన అవినీతి నిరోధక శాఖ, ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ విభాగం అధికారులు ఎలక్ట్రానిక్ కార్డుల ద్వారా చోరీ జరిగినట్లు గుర్తించారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులు అంతా అరబ్ దేశస్తులేనని వెల్లడించారు. ఇక కింగ్డమ్ వెలుపల ఉన్న నాలుగో నిందితుడ్ని అరెస్ట్ చేసేందుకు బహ్రెయిన్ అధికారులు ఇంటర్ పోల్ సహాయాన్ని కోరారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com