దుబాయ్: వచ్చే వారంలో ఈ-స్కూటర్ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ ప్రారంభం
- October 20, 2020
దుబాయ్:పర్యావరణహితం, ట్రాఫిక్ ఇబ్బందులను తగ్గించేందుకు దోహదపడే ఈ-స్కూటర్ లను వచ్చే వారంలో ప్రారంభించనున్నట్లు రోడ్డు, రవాణా అధికార విభాగం ప్రకటించింది. న్యూ అల్ ఘుబైబా బస్ స్టేషన్ సందర్శనలో భాగంగా దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఈ ఈ-స్కూటర్ ప్రాజెక్ట్ గురించి వివరించారు. ఈ-స్కూటర్ ప్రాజెక్టులో ఐదు ఆపరేట్ సంస్థలు భాగస్వామ్యం అవుతన్నట్లు ఆర్టీఏ వివరించింది. వీటిలో కారెం, లైమ్, టైర్ అనే మూడు అంతర్జాతీయ సంస్థలతో పాటు దుబాయ్ ఎస్ఎంఈ మద్దతు ఉన్న రెండు స్థానిక సంస్థలు అర్నాబ్, స్కుర్ట్ భాగస్వామ్యం అవుతున్నాయి. ట్రయల్ రన్ గా ప్రస్తుతం దుబాయ్ లోని ఐదు జోన్లలో ఈ-స్కూటర్ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. మొహమ్మద్ బిన్ రషీద్ బౌలేవార్డ్, దుబాయ్ ఇంటర్నెట్ సిటీ, రెండో డిసెంబర్ సెయింట్, అల్ రిగ్గ, జుమేరా లేక్ టవర్స్ జోన్లను ఈ-స్కూటర్ ప్రాజెక్టు ప్రారంభానికి ఎంపిక చేశారు. జనాభా సాంద్రత, ప్రైవేట్ సంస్థల అభివృద్ధి సూచిక, ప్రజా రవాణా సేవల లభ్యత, సమీకృత మౌలిక సదుపాయాలు, అధిక ట్రాఫిక్ భద్రతా రికార్డులు వంటి నిర్దిష్ట ప్రమాణాల ప్రకారం ఈ జోన్లను ఎంపిక చేసినట్లు ఆర్టీఏ వెల్లడించింది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధి పై సౌదీ అరేబియా కీలక ప్రకటన..!!
- అమీర్, ఇటలీ మధ్య బలమైన సంబంధాలు..!!
- అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో ఘనంగా సుందరకాండ ప్రవచన జ్ఞాన యజ్ఞం ప్రారంభం
- డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం: సీపీ సుమతి
- రాజీనామా చేయనంటు మొండికేసిన మమతా బెనర్జీ..గవర్నర్ సంచలన నిర్ణయం
- పరిపాలనలో కొత్త విధానానికి శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు
- దుబాయ్లో షేర్డ్ హౌసింగ్ చట్టం: త్వరలో ప్రారంభం కానున్న షేరింగ్ పర్మిట్ దరఖాస్తులు
- డ్రగ్స్ కట్టడి చేయడమే తొలి ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- ముంబై కుటుంబం మృతి కేసులో వీడిన మిస్టరీ!
- అమరావతిలో KIMS ఆసుపత్రి!









