ఒమన్, ఇండియా ప్రతినిధుల సమావేశం..పలురంగాల్లో పరస్పర సహకారంపై చర్చ
- October 20, 2020
మస్కట్:ద్వైపాక్షిక సంబంధాల పటిష్టత, పలు రంగాల్లో ఇరు దేశాల మధ్య పరస్పర సహకారంపై చర్చించేందుకు ఒమన్, భారత్ ప్రతినిధులు సంయుక్త సమావేశంలో పాల్గొన్నారు. ఒమన్ తరపున వాణిజ్య, పారిశ్రామిక, పెట్టుబడి వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంత్రి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగినట్లు ఒమన్ అధికారులు తెలిపారు. ఆన్ లైన్ ద్వారా జరిగిన ఈ మీటింగ్ లో పలు రంగాల్లో పెట్టుబడులు, పరస్పర సహకారంపై ప్రతినిధులు చర్చించారు. ముఖ్యంగా అంతరిక్ష పరిశోధన, పౌర విమానయానం, పునరుత్పాదక శక్తి, సౌర విద్యుత్, అహార భద్రత, వైద్య రంగం, ఐటీ రంగాలకు సంబంధించి ఇరుదేశాలు ఒకరికొకరు సహకరించుకోవాలని డిస్కస్ చేశారు. ఇదిలాఉంటే..కొన్నేళ్లుగా ఒమన్, భారత్ మధ్య వాణిజ్య బంధం మరింత బలపడుతున్నట్లు ఇరు దేశాల ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. గతేడాదిలో భారత్ కు ఒమన్ నుంచి ఎగుమతులు 0.69శాతం పెరిగిందని, దీని విలువ 5.93 బిలియన్ ఒమన్ రియాల్స్ అని అధికారులు వెల్లడించారు. అదే సమయంలో భారత్ నుంచి ఒమన్ కు ఎగుమతులు 33 శాతం పెరిగినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- హర్మూజ్లో ఉద్రిక్తత.. అమెరికా, ఇరాన్ మధ్య కాల్పులు
- బహ్రెయిన్లో డ్రగ్ ట్రాఫికింగ్..లైఫ్ సెంటెన్స్..!!
- జలీబ్ అల్-షుయూఖ్లో 42 ఓల్డ్ బిల్డింగ్ తొలగింపు..!!
- అమీర్ కప్ ఫైనల్..మెట్రోలింక్, మెట్రోఎక్స్ ప్రెస్ సమయాల్లో మార్పులు..!!
- దుబాయ్లో సింగిల్ మమ్ ని వరించిన అధృష్టం..!!
- 90వేల మంది లబ్ధిదారులకు ప్లాట్ లేదా రెసిడెన్షియల్ యూనిట్స్..!!
- హోర్ముజ్ జలసంధి పై సౌదీ అరేబియా కీలక ప్రకటన..!!
- అమీర్, ఇటలీ మధ్య బలమైన సంబంధాలు..!!
- అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో ఘనంగా సుందరకాండ ప్రవచన జ్ఞాన యజ్ఞం ప్రారంభం
- డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం: సీపీ సుమతి









