బహ్రెయిన్ : ప్రైవేట్ స్కూల్స్ లో తనిఖీలు చేపట్టిన ఆరోగ్య, విద్యా మంత్రిత్వ శాఖ
- October 20, 2020
మనామా:విద్యార్ధుల ఆరోగ్య సంరక్షణ కోసం పాఠశాలల యజమాన్యాలు తగిన జాగ్రత్తలు తీసుకున్నాయో లేదో నిర్ధారించుకునేందుకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ, విద్యా మంత్రిత్వ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టారు. అన్ని ప్రైవేట్ స్కూల్స్ ను పరిశీలించిన అధికారులు..కోవిడ్ 19 వ్యాప్తి నియంత్రణకు మంత్రిత్వ శాఖ సూచించిన మార్గనిర్దేశకాలకు అనుగుణంగా సౌకర్యాలు చేపట్టారా..లేదా అని పరిశీలించారు. ప్రస్తుత కరోనా పీడ రోజులను ఎదుర్కొని విద్యార్ధులు వైరస్ బారిన పడకుండా ప్రతి పాఠశాలలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్కూల్స్ ప్రారంభ సమయంలోనే ఆరోగ్య శాఖ సూచించిన విషయం తెలిసిందే. స్కూల్ కి వచ్చే ప్రతి ఒక్కరి శరీర ఉష్ణోగ్రతను తనిఖీ చేసిన తర్వాత కంపౌండ్ లోకి అనుమతించాలని, తరగతి గదుల్లో విద్యార్ధులు తప్పనిసరిగా భౌతిక దూరం పాటించేలా సీటింగ్ సౌకర్యం కల్పించాలని అధికారులు తెలిపారు. అలాగే స్కూల్ ప్రాంగణంలోని తరగతి గదులు, ల్యాబ్, టాయిలెట్స్ లను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాలని అధికారులు స్కూల్స్ యాజమాన్యాలకు సూచించారు.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం