బహ్రెయిన్ : ప్రైవేట్ స్కూల్స్ లో తనిఖీలు చేపట్టిన ఆరోగ్య, విద్యా మంత్రిత్వ శాఖ
- October 20, 2020
మనామా:విద్యార్ధుల ఆరోగ్య సంరక్షణ కోసం పాఠశాలల యజమాన్యాలు తగిన జాగ్రత్తలు తీసుకున్నాయో లేదో నిర్ధారించుకునేందుకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ, విద్యా మంత్రిత్వ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టారు. అన్ని ప్రైవేట్ స్కూల్స్ ను పరిశీలించిన అధికారులు..కోవిడ్ 19 వ్యాప్తి నియంత్రణకు మంత్రిత్వ శాఖ సూచించిన మార్గనిర్దేశకాలకు అనుగుణంగా సౌకర్యాలు చేపట్టారా..లేదా అని పరిశీలించారు. ప్రస్తుత కరోనా పీడ రోజులను ఎదుర్కొని విద్యార్ధులు వైరస్ బారిన పడకుండా ప్రతి పాఠశాలలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్కూల్స్ ప్రారంభ సమయంలోనే ఆరోగ్య శాఖ సూచించిన విషయం తెలిసిందే. స్కూల్ కి వచ్చే ప్రతి ఒక్కరి శరీర ఉష్ణోగ్రతను తనిఖీ చేసిన తర్వాత కంపౌండ్ లోకి అనుమతించాలని, తరగతి గదుల్లో విద్యార్ధులు తప్పనిసరిగా భౌతిక దూరం పాటించేలా సీటింగ్ సౌకర్యం కల్పించాలని అధికారులు తెలిపారు. అలాగే స్కూల్ ప్రాంగణంలోని తరగతి గదులు, ల్యాబ్, టాయిలెట్స్ లను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాలని అధికారులు స్కూల్స్ యాజమాన్యాలకు సూచించారు.
తాజా వార్తలు
- అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో ఘనంగా సుందరకాండ ప్రవచన జ్ఞాన యజ్ఞం ప్రారంభం
- డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం: సీపీ సుమతి
- రాజీనామా చేయనంటు మొండికేసిన మమతా బెనర్జీ..గవర్నర్ సంచలన నిర్ణయం
- పరిపాలనలో కొత్త విధానానికి శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు
- దుబాయ్లో షేర్డ్ హౌసింగ్ చట్టం: త్వరలో ప్రారంభం కానున్న షేరింగ్ పర్మిట్ దరఖాస్తులు
- డ్రగ్స్ కట్టడి చేయడమే తొలి ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- ముంబై కుటుంబం మృతి కేసులో వీడిన మిస్టరీ!
- అమరావతిలో KIMS ఆసుపత్రి!
- ప్రధాని మోడీ పర్యటన..బీజేపీకి బూస్ట్ ఇస్తుందా?
- కొండగట్టు అంజన్న ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు









