తైవాన్ - చైనా మధ్య కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు
- October 20, 2020చైనా దళాలు తైవాన్పై యుద్ధానికి సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. ఫ్యుజియన్, గ్యాంగ్డాంగ్లలో మెరైన్ కార్ప్స్, రాకెట్ ఫోర్స్ స్థావరాలను విస్తరించినట్లు ఉపగ్రహ ఛాయా చిత్రాలు వెల్లడిస్తున్నాయి. అన్ని రాకెట్ ఫోర్స్ బ్రిగేడ్లు ప్రస్తుతం సంపూర్ణంగా సిద్ధంగా ఉన్నాయి.
తైవాన్ చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ నియంత్రణలో ఎప్పుడూ లేదు. కానీ తైవాన్ ద్వీపం తమదేనని చైనా చెప్తోంది. ఇటీవలి కాలంలో ఈస్టర్న్, సదరన్ థియేటర్ కమాండ్స్లోని మిసైల్ బేస్లలో కొన్నిటిని రెట్టింపు చేసింది. దీనినిబట్టి తైవాన్పై యుద్థానికి చైనా సిద్ధమవుతున్న సంకేతాలు అందుతున్నాయి.
చైనా, అమెరికా మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో హైపర్సోనిక్ మిసైల్ను మోహరించే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి.
మరోవైపు చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ మంగళవారం సదరన్ ప్రావిన్స్ గ్వాంగ్డాంగ్లో పర్యటించారు. యుద్ధానికి సిద్ధమవడంపై దృష్టిపెట్టాలని దళాలను ఆదేశించారు.
తాజా వార్తలు
- T20 ప్రపంచకప్...బ్రాండ్ అంబాసిడర్గా బోల్ట్
- తెలంగాణ రాష్ట్రంలో వేర్వేరు రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి
- ఇళ్ల మరమ్మతులకు Dh2 బిలియన్ ఫండ్
- ఈజిప్షియన్లకు వర్క్ పర్మిట్ జారీ నిలిపివేత..!
- విదేశీ కార్మికుల కోసం బహ్రెయిన్లో కొత్త చట్టం..!
- హాస్పిటల్లో చేరిన కింగ్ సల్మాన్..!
- ఒమన్ లో 'ఎక్స్చేంజ్ యువర్ ల్యాండ్' ప్రారంభం
- ఏప్రిల్ 16న విధించిన ట్రాఫిక్ జరిమానాలు రద్దు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..