కేసీఆర్ పిలుపు మేరకు కదిలొచ్చిన తెలుగు సినీ ఇండస్ట్రీ
- October 20, 2020హైదరాబాద్లో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో అనేక కాలనీలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. జనజీనవం అస్థవ్యస్తమైంది. వేలాదిమంది నగరవాసులు నిరాశ్రయులయ్యారు. దీంతో ప్రజలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి తక్షణ సహాయం కింద 550కోట్లను కెటాయించారు. దీనికి తోడు బాధితులను ఆదుకునేందుకు ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. దీంతో పలువురు సినీ ప్రముఖులు సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాలను ప్రకటించారు. తమ వంతు సహాయం చేస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వానికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ 15 కోట్ల ఆర్థికసాయం ప్రకటించారు.
ముఖ్యమంత్రి పిలుపు మేరకు తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి చిరంజీవి కోటి రూపాయల ఆర్ధిక సహాయాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి అందించారు. అలాగే హీరో మహేష్ బాబు రూ.కోటి రూపాయలు, నాగార్జున రూ. 50 లక్షలు, ఎన్టీఆర్ రూ. 50 లక్షలు, విజయ్ దేవరకొండ రూ.10 లక్షలు ప్రకటించారు. హరీష్ శంకర్, అనీల్ రావిపూడి చెరో రూ. 5 లక్షల చొప్పున విరాళం అందించనున్నట్లు తెలిపారు. గత వందేళ్లలో ఏనాడు లేనివిధంగా కురిసిన వర్షాలకు హైదరాబాద్ నగరం అతలాకుతలమైంది. అపార ప్రాణ, ఆస్థినష్టం జరిగింది. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. ప్రృతి వైపరిత్యంతో అల్లాడిపోతున్న వారికి నావంతు సహాయంగా సీఎం రిలీఫ్ ఫండ్కు కోటి రూపాయలు అందిస్తున్నానని చిరంజీవి అన్నారు. వీలైనంత మంది తమవంతు సహాయం అందించాలని ట్విట్టర్లో వెల్లడించారు. గడిచిన వంద ఏళ్లలో ఏనాడు హైదరాబాద్లో ఇలాంటి పరిస్థితి ఏర్పడలేదు. భారీ వర్షం కారణంగా నగరం చిగురుటాకులా వణికిపోయింది. జన జీవనం భయాందోళకు గురైంది. ఒక రకంగా చెప్పాలంటే కోస్తా ప్రాంతంలో ఎలాంటి పరిస్థితి ఉంటుందో అలా తయారైంది. దీంతో వర్షం వస్తుందంటే చాలు నగరవాసులు భయంతో వణికిపోతున్నారు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం