వీసా-ఫ్రీ ప్రయాణం: ఇజ్రాయెల్ - యూఏఈ మధ్య ఒప్పందం
- October 20, 2020యూఏఈ మరియు ఇజ్రాయెల్ మధ్య వీసా ఫ్రీ ట్రావెల్ని తమ జాతీయులకు అందించాలని నిర్ణయించినట్లు ఇజ్రాయెలీ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు వెల్లడించారు. కాగా, తొలి యూఏఈ డెలిగేషన్ ఇజ్రాయెల్లోని బెన్ గురియాన్ ఎయిర్ పోర్ట్లో ల్యాండ్ అయ్యింది. ‘ఈ రోజు కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాం’ అని ఈ సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాని చెప్పారు. ఎకానమీ, సైన్స్, టెక్నాలజీ మరియు ఏవియేషన్ రంగాల్లో యూఏఈ - ఇజ్రాయెల్ మధ్య ఒప్పందాలు కుదిరినట్లు నెతన్యాహు వెల్లడించారు. బెన్ గురియాన్ ఎయిర్ పోర్ట్ వద్ద జరిగిన ప్రెస్మీట్లో నెతన్యాహు మాట్లాడారు. ఇరు దేశాలకు చెందినవారూ ఇట్నుంచి అటు అట్నుంచి ఇటు వీసా ఎగ్జంప్షన్తో ప్రయాణించవచ్చునని చెప్పారు. కాగా, తాజా ఒప్పందాల మేరకు సదరన్ ఇజ్రాయెల్లోని చిన్న ఎయిర్ పోర్ట్కి చార్టర్డ్ విమానల్ని అలాగే 10 వీక్లీ కార్గో విమానాల్ని నడిపేలా కూడా ఒప్పందం చేసుకోవడం జరిగింది. 28 వీక్లీ కమర్షియల్ విమానాల్ని ఇజ్రాయెల్లోని గురియాన్ ఎయిర్పోర్ట్ నుంచి దుబాయ్, అబుదాబీలకు నడపనున్నారు.
తాజా వార్తలు
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు
- కువైట్లో బ్యాచిలర్లకు కొత్త కష్టాలు..!
- QR247 మిలియన్లు తిరిగి చెల్లించాలని సీఈఓను ఆదేశించిన కోర్టు
- 2023లో 99%కి చేరుకున్న సౌదీ ఇంటర్నెట్ వినియోగం
- మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం.. అగ్రస్థానంలో భారతీయులు
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ సీజన్..మరో 3 రోజులు పొడిగింపు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం