వీసా-ఫ్రీ ప్రయాణం: ఇజ్రాయెల్ - యూఏఈ మధ్య ఒప్పందం
- October 20, 2020
యూఏఈ మరియు ఇజ్రాయెల్ మధ్య వీసా ఫ్రీ ట్రావెల్ని తమ జాతీయులకు అందించాలని నిర్ణయించినట్లు ఇజ్రాయెలీ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు వెల్లడించారు. కాగా, తొలి యూఏఈ డెలిగేషన్ ఇజ్రాయెల్లోని బెన్ గురియాన్ ఎయిర్ పోర్ట్లో ల్యాండ్ అయ్యింది. ‘ఈ రోజు కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాం’ అని ఈ సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాని చెప్పారు. ఎకానమీ, సైన్స్, టెక్నాలజీ మరియు ఏవియేషన్ రంగాల్లో యూఏఈ - ఇజ్రాయెల్ మధ్య ఒప్పందాలు కుదిరినట్లు నెతన్యాహు వెల్లడించారు. బెన్ గురియాన్ ఎయిర్ పోర్ట్ వద్ద జరిగిన ప్రెస్మీట్లో నెతన్యాహు మాట్లాడారు. ఇరు దేశాలకు చెందినవారూ ఇట్నుంచి అటు అట్నుంచి ఇటు వీసా ఎగ్జంప్షన్తో ప్రయాణించవచ్చునని చెప్పారు. కాగా, తాజా ఒప్పందాల మేరకు సదరన్ ఇజ్రాయెల్లోని చిన్న ఎయిర్ పోర్ట్కి చార్టర్డ్ విమానల్ని అలాగే 10 వీక్లీ కార్గో విమానాల్ని నడిపేలా కూడా ఒప్పందం చేసుకోవడం జరిగింది. 28 వీక్లీ కమర్షియల్ విమానాల్ని ఇజ్రాయెల్లోని గురియాన్ ఎయిర్పోర్ట్ నుంచి దుబాయ్, అబుదాబీలకు నడపనున్నారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు