వీసా-ఫ్రీ ప్రయాణం: ఇజ్రాయెల్ - యూఏఈ మధ్య ఒప్పందం
- October 20, 2020
యూఏఈ మరియు ఇజ్రాయెల్ మధ్య వీసా ఫ్రీ ట్రావెల్ని తమ జాతీయులకు అందించాలని నిర్ణయించినట్లు ఇజ్రాయెలీ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు వెల్లడించారు. కాగా, తొలి యూఏఈ డెలిగేషన్ ఇజ్రాయెల్లోని బెన్ గురియాన్ ఎయిర్ పోర్ట్లో ల్యాండ్ అయ్యింది. ‘ఈ రోజు కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాం’ అని ఈ సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాని చెప్పారు. ఎకానమీ, సైన్స్, టెక్నాలజీ మరియు ఏవియేషన్ రంగాల్లో యూఏఈ - ఇజ్రాయెల్ మధ్య ఒప్పందాలు కుదిరినట్లు నెతన్యాహు వెల్లడించారు. బెన్ గురియాన్ ఎయిర్ పోర్ట్ వద్ద జరిగిన ప్రెస్మీట్లో నెతన్యాహు మాట్లాడారు. ఇరు దేశాలకు చెందినవారూ ఇట్నుంచి అటు అట్నుంచి ఇటు వీసా ఎగ్జంప్షన్తో ప్రయాణించవచ్చునని చెప్పారు. కాగా, తాజా ఒప్పందాల మేరకు సదరన్ ఇజ్రాయెల్లోని చిన్న ఎయిర్ పోర్ట్కి చార్టర్డ్ విమానల్ని అలాగే 10 వీక్లీ కార్గో విమానాల్ని నడిపేలా కూడా ఒప్పందం చేసుకోవడం జరిగింది. 28 వీక్లీ కమర్షియల్ విమానాల్ని ఇజ్రాయెల్లోని గురియాన్ ఎయిర్పోర్ట్ నుంచి దుబాయ్, అబుదాబీలకు నడపనున్నారు.
తాజా వార్తలు
- IPL2026: ఢిల్లీ క్యాపిటల్స్ పై కోల్కతా నైట్ రైడర్స్ ఘనవిజయం
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ప్రారంభించిన అపోలో హాస్పిటల్స్
- యూఏఈలో ప్రత్యక్ష లేదా దూర విద్య పై మే 10న నిర్ణయం
- విదేశీ చదువులకు పావలా వడ్డీ రుణాలు..సీఎం కీలక నిర్ణయం
- పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా మళ్లీ రంగస్వామి
- ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- యూఏఈ: రెండు బాలిస్టిక్ క్షిపణులు, మూడు డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థ
- ‘విజయ్ అను నేను‘ అంటూ రేపు విజయ్ సీఎం గా ప్రమాణ స్వీకారం
- పని మనుషులతో జాగ్రత్త: సీపీ సజ్జనార్
- యువతి ప్రాణాలను కాపాడిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు









