వీసా-ఫ్రీ ప్రయాణం: ఇజ్రాయెల్ - యూఏఈ మధ్య ఒప్పందం
- October 20, 2020యూఏఈ మరియు ఇజ్రాయెల్ మధ్య వీసా ఫ్రీ ట్రావెల్ని తమ జాతీయులకు అందించాలని నిర్ణయించినట్లు ఇజ్రాయెలీ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు వెల్లడించారు. కాగా, తొలి యూఏఈ డెలిగేషన్ ఇజ్రాయెల్లోని బెన్ గురియాన్ ఎయిర్ పోర్ట్లో ల్యాండ్ అయ్యింది. ‘ఈ రోజు కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాం’ అని ఈ సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాని చెప్పారు. ఎకానమీ, సైన్స్, టెక్నాలజీ మరియు ఏవియేషన్ రంగాల్లో యూఏఈ - ఇజ్రాయెల్ మధ్య ఒప్పందాలు కుదిరినట్లు నెతన్యాహు వెల్లడించారు. బెన్ గురియాన్ ఎయిర్ పోర్ట్ వద్ద జరిగిన ప్రెస్మీట్లో నెతన్యాహు మాట్లాడారు. ఇరు దేశాలకు చెందినవారూ ఇట్నుంచి అటు అట్నుంచి ఇటు వీసా ఎగ్జంప్షన్తో ప్రయాణించవచ్చునని చెప్పారు. కాగా, తాజా ఒప్పందాల మేరకు సదరన్ ఇజ్రాయెల్లోని చిన్న ఎయిర్ పోర్ట్కి చార్టర్డ్ విమానల్ని అలాగే 10 వీక్లీ కార్గో విమానాల్ని నడిపేలా కూడా ఒప్పందం చేసుకోవడం జరిగింది. 28 వీక్లీ కమర్షియల్ విమానాల్ని ఇజ్రాయెల్లోని గురియాన్ ఎయిర్పోర్ట్ నుంచి దుబాయ్, అబుదాబీలకు నడపనున్నారు.
తాజా వార్తలు
- నాలుగో విడత ఎన్నికలు..ముగిసిన నామినేషన్ల గడువు
- తెలంగాణలో తీవ్ర వడగాలులు..
- T20 ప్రపంచకప్...బ్రాండ్ అంబాసిడర్గా బోల్ట్
- తెలంగాణ రాష్ట్రంలో వేర్వేరు రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి
- ఇళ్ల మరమ్మతులకు Dh2 బిలియన్ ఫండ్
- ఈజిప్షియన్లకు వర్క్ పర్మిట్ జారీ నిలిపివేత..!
- విదేశీ కార్మికుల కోసం బహ్రెయిన్లో కొత్త చట్టం..!
- హాస్పిటల్లో చేరిన కింగ్ సల్మాన్..!
- ఒమన్ లో 'ఎక్స్చేంజ్ యువర్ ల్యాండ్' ప్రారంభం
- ఏప్రిల్ 16న విధించిన ట్రాఫిక్ జరిమానాలు రద్దు