బాణసంచా కర్మాగారంలో పేలుడు: ఐదుగురి మృతి

- October 23, 2020 , by Maagulf
బాణసంచా కర్మాగారంలో పేలుడు: ఐదుగురి మృతి

తమిళనాడులోని మధురై జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది..విరుదునగర్‌లో టపాసుల తయారీ కేంద్రంలోఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది..ప్రమాదంలో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి..ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు సహా ఐదుగురు సజీవదహనం అవగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటల అదుపునకు యత్నిస్తున్నారు.. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com