న్యూ ఇ-వీసా, పాస్‌పోర్ట్‌ సర్వీసుల్ని ప్రారంభించిన సౌదీ

- October 23, 2020 , by Maagulf
న్యూ ఇ-వీసా, పాస్‌పోర్ట్‌ సర్వీసుల్ని ప్రారంభించిన సౌదీ

సౌదీ అరేబియా: సౌదీ అరేబియా, కొత్త ఎలక్ట్రానిక్‌ సర్వీసుల్ని పౌరులు, వలసదారుల కోసం ప్రారంభించింది. వీసా మరియు పాస్‌పోర్ట్‌ జారీకి సంబంధించి వినూత్న ప్రక్రియల్ని ప్రారంభించినట్లు అధికారులు పేర్కొన్నారు. సౌదీ జనరల్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ పాస్‌పోర్ట్స్‌ న్యూ సర్వీసుల్ని ఇంటీరియర్‌ మినిస్టర్‌ ప్రిన్స్‌ అబ్దుల్‌ అజీజ్‌ బిన్‌ సౌద్‌ ప్రారంభించారు. అబ్షర్‌ ఇండివిడ్యువల్స్‌, అబ్షర్‌ బిజినెస్‌ మరియు ఎక్స్‌పాట్రియేట్‌ అనే పేర్లతో వీటిని ప్రారంభించడం జరిగింది. ఎలక్ట్రానిక్‌ విధానంలో తమ రెసిడెన్సీ పర్మిట్లను వలసదారులు రెన్యువల్‌ చేసుకోవడానికి కొత్త సర్వీసు ఉపయోగపడుతుంది. 15 ఏళ్ళ లోపు చిన్నారులకు సౌదీ పాస్‌పోర్ట్‌ రెన్యువల్‌కి వీలుగా కూడా కొత్త సర్వీసు ఉపకరిస్తుంది. వ్యక్తిగతంగా జనరల్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ పాస్‌పోర్ట్స్‌తో సంబంధం లేకుండానే కమ్యూనికేట్‌ చేసేలా ఈ విధానం తోడ్పడుతుంది. కాగా, సౌదీ అరేబియా జనాభా 34.8 మిలియన్లలో విదేశీయుల సంఖ్య 10.5 మిలియన్లుగా వుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com