న్యూ ఇ-వీసా, పాస్పోర్ట్ సర్వీసుల్ని ప్రారంభించిన సౌదీ
- October 23, 2020
సౌదీ అరేబియా: సౌదీ అరేబియా, కొత్త ఎలక్ట్రానిక్ సర్వీసుల్ని పౌరులు, వలసదారుల కోసం ప్రారంభించింది. వీసా మరియు పాస్పోర్ట్ జారీకి సంబంధించి వినూత్న ప్రక్రియల్ని ప్రారంభించినట్లు అధికారులు పేర్కొన్నారు. సౌదీ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్స్ న్యూ సర్వీసుల్ని ఇంటీరియర్ మినిస్టర్ ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సౌద్ ప్రారంభించారు. అబ్షర్ ఇండివిడ్యువల్స్, అబ్షర్ బిజినెస్ మరియు ఎక్స్పాట్రియేట్ అనే పేర్లతో వీటిని ప్రారంభించడం జరిగింది. ఎలక్ట్రానిక్ విధానంలో తమ రెసిడెన్సీ పర్మిట్లను వలసదారులు రెన్యువల్ చేసుకోవడానికి కొత్త సర్వీసు ఉపయోగపడుతుంది. 15 ఏళ్ళ లోపు చిన్నారులకు సౌదీ పాస్పోర్ట్ రెన్యువల్కి వీలుగా కూడా కొత్త సర్వీసు ఉపకరిస్తుంది. వ్యక్తిగతంగా జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్స్తో సంబంధం లేకుండానే కమ్యూనికేట్ చేసేలా ఈ విధానం తోడ్పడుతుంది. కాగా, సౌదీ అరేబియా జనాభా 34.8 మిలియన్లలో విదేశీయుల సంఖ్య 10.5 మిలియన్లుగా వుంది.
తాజా వార్తలు
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!
- ఉగ్రవాద ముఠా అరెస్ట్ పై కువైట్ హోంశాఖ క్లారిటీ..!!
- 7రోజుల్లో 18 వేల ఎక్స్ పైరీ ఉత్పత్తులు స్వాధీనం..!!







