దుబాయ్: నవంబర్ 3 దేశ ప్రజలంతా జాతీయ జెండాను ఆవిష్కరించాలని షేక్ మొహమ్మద్ పిలుపు

- October 24, 2020 , by Maagulf
దుబాయ్: నవంబర్ 3 దేశ ప్రజలంతా జాతీయ జెండాను ఆవిష్కరించాలని షేక్ మొహమ్మద్ పిలుపు

దుబాయ్:నవంబర్ 3న యూఏఈ పౌరులు, ప్రవాసీయులు అంతా జాతీయ జెండా దినోత్సవాన్ని విధిగా నిర్వహించాలని యూఏఈ ఉపాధ్యక్షుడు, ప్రధాన మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొనాలని, అన్ని మంత్రిత్వ శాఖల కార్యాలయాల్లో, ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థల్లో యూఏఈ జాతీయ జెండాను ఆవిష్కరించాలని ఆయన అన్నారు. షేక్ ఖలీఫా బిన్ జయాద్ అల్ నెహ్యాన్ నవంబర్ 3న దేశ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భాన్ని పురస్కరించుకొని..2003 నుంచి నవంబర్ 3ను జాతీయ జెండా దినోత్సవం నిర్వహిస్తున్న విషయంలో తెలిసిందే. జాతీయ జెండా దినోత్సవంలో పాల్గొని దేశ ప్రజలు, ప్రవాసీయులు అంతా యూఏఈ సమైక్యతను చాటి చెప్పాలని షేక్ మొహమ్మద్ పిలుపునిచ్చారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com