దోహాలో 'బతుకమ్మ' వేడుకలు

- October 24, 2020 , by Maagulf
దోహాలో \'బతుకమ్మ\' వేడుకలు

దోహా:తెలంగాణ జాగ్రుతి ఖతర్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. 
ముఖ్య అతిథిలుగా ఖతర్ లో భారత్ రాయబారి దీపక్ మిత్తల్ ,AP మణికంఠన్ , బాబు రాజన్ , వినోద నాయర్ హాజరయ్యారు.

తెలంగాణ జాగృతి ఖతర్ అధ్యక్షురాలు నందిని అబ్బగౌని తెలిపిన వివరాల ప్రకారం ఖతర్ కోవిడ్ నిబంధనలు ప్రకారం భౌతిక దూరం పాటిస్తూ , చేనేత మాస్క్లు ధరించి  బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించామని, మనషుల మధ్య దూరం పెంచిన మాయదారి కరోనా ఆ గౌరమ్మ దయవల్ల అంతమవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.అనంతరం  గత చేనేత దినోత్సవ సందర్భంగా చేనేత చాలెంజ్ విజేతలకు తెలంగాణ నుండి ఖతర్ కు ప్రత్యేకంగా తెప్పించిన చేనేత చీరలు బహుకరించారు.

ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు  హరికా ప్రేమ్, సుధ శ్రీ రామోజీ,స్వప్న కేసా, సాయిగిరి వంశీ, స్వప్న అల్లే, మమతా దుర్గం, అరుణ్ అలిశెట్టి, శ్రీ కాంత్ కొమ్ముల పాల్గొన్నారు.

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతర్)  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com