దోహాలో 'బతుకమ్మ' వేడుకలు
- October 24, 2020
దోహా:తెలంగాణ జాగ్రుతి ఖతర్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి.
ముఖ్య అతిథిలుగా ఖతర్ లో భారత్ రాయబారి దీపక్ మిత్తల్ ,AP మణికంఠన్ , బాబు రాజన్ , వినోద నాయర్ హాజరయ్యారు.
తెలంగాణ జాగృతి ఖతర్ అధ్యక్షురాలు నందిని అబ్బగౌని తెలిపిన వివరాల ప్రకారం ఖతర్ కోవిడ్ నిబంధనలు ప్రకారం భౌతిక దూరం పాటిస్తూ , చేనేత మాస్క్లు ధరించి బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించామని, మనషుల మధ్య దూరం పెంచిన మాయదారి కరోనా ఆ గౌరమ్మ దయవల్ల అంతమవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.అనంతరం గత చేనేత దినోత్సవ సందర్భంగా చేనేత చాలెంజ్ విజేతలకు తెలంగాణ నుండి ఖతర్ కు ప్రత్యేకంగా తెప్పించిన చేనేత చీరలు బహుకరించారు.
ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు హరికా ప్రేమ్, సుధ శ్రీ రామోజీ,స్వప్న కేసా, సాయిగిరి వంశీ, స్వప్న అల్లే, మమతా దుర్గం, అరుణ్ అలిశెట్టి, శ్రీ కాంత్ కొమ్ముల పాల్గొన్నారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతర్)





తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!







