ప్రపంచంలోనే వేగవంతమైన నెట్ వర్క్ గా ఎతిసలాత్ కు ఓక్లా గుర్తింపు
- October 24, 2020
యూఏఈ:యూఏఈ టెలికం ఆపరేటర్ ఎతిసలాత్ ప్రపంచంలోనే అత్యధిక వేగవంతమైన నెట్ వర్క్ కలిగిన టెలికం సంస్థగా గుర్తింపు పొందింది. రెండో త్రైమాసిక మాసం నుంచి మూడో త్రైమాసిక మాసానికి సంబంధించి 98.78 స్కోర్ తో ఎతిసలాత్ ఈ ఘనత సాధించినట్లు ప్రముఖ టెలికం రేటింగ్ సంస్థ ఓక్లా ప్రకటించింది. ఓక్లా సంస్థ ప్రపంచవ్యాప్తంగా అని టెలికం ఆపరేటింగ్ సంస్థల పని తీరును, మొబైల్ నెట్వర్క్ వేగాన్ని పరిశీలించి విశ్లేషించే ఓ సంస్థ. అధునాతన సాంకేతికతను వినియోగించటం, వినియోగదారుల మధ్య ఎంత వేగంగా అనుసంధానం చేస్తున్నాయనే అంశాలను ప్రమాణికంగా తీసుకొని స్పీడ్ టెస్ట్ నివేదికను రూపొందిస్తుంది. ఈ నివేదిక ఆధారంగా ఓక్లా ప్రకటించిన తొలి పది ర్యాంకుల్లో యూఏఈలోని ఎతిసలాత్ 98.78 స్పీడ్ స్కోరుతో తొలి ర్యాంక్ సాధించింది. ఆ తర్వాత స్థానంలో వరుసగా ఎస్కె టెలికాం (దక్షిణ కొరియా), ఒరేడూ (ఖతార్), వివాకామ్ (బల్గేరియా), టి-మొబైల్ (నెదర్లాండ్స్), టెలస్ (కెనడా), టెలినార్ (నార్వే), వొడాఫోన్ (అల్బేనియా), చైనా మొబైల్ (చైనా), హర్వాట్స్కి టెలికాం (క్రొయేషియా) మరియు టెలియా (లిథువేనియా) ఉన్నాయి.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







